చంద్రబాబుకు ఒక కీలక లక్షణం ఉంది. ముందు తాను అప్పగించిన పనిని పూర్తి చేయాలని ఆయన చెబుతారు. ఆ తర్వాత.. నాయకులు చెప్పే మాటలు వింటారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయ త్నిస్తారు. తాజాగా కొందరు.. నాయకులు సీఎంవోకు క్యూకట్టారు. వీరిలో ఉమ్మడి తూర్పు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. పలు అర్జీలతో సీఎంవోకు వచ్చిన వారు చాలా సేపు వెయిట్ చేశారు.
అయితే.. చివరకు చంద్రబాబే బయటకు వచ్చి.. వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ తమ డిమాండ్లు వినిపించారు. పదవులు.. గుర్తింపు.. సహా.. తమ నియోజకవర్గంలో సమస్యలను ఏకరువు పెట్టారు. ఇదే సమయంలో కొందరు వైసీపీ నాయకుల పై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబుకు విన్నవించారు. అయితే.. చంద్రబాబు వారిని ఉద్దేశించి రెండు కీలక ప్రశ్నలు అడిగారు.
“ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని చెప్పాం. మీ మీ ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి మీరు ఎందుకు పాల్గొనలేదు. ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు బాధ్యత లేదా? ముందు ప్రజలను కలిసి వారి సమస్యలు వినండి. ఆ తర్వాత.. మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే మీదగ్గరకు వస్తాను. ఏం చేయాలో అది చేస్తా” అని అన్నారు. అంతే.. ఇంక మిగిలిన తమ్ముళ్లు కూడా కిక్కురు మనకుండా… జేబుల్లో చేతులు పెట్టుకుని తిరిగి కూడా చూడకుండా వెనక్కి వచ్చేశారు.
ఏదేమైనా.. బాబు నిబద్ధతకు పెద్దపీట వేస్తారు. ఆయన చెప్పింది.. విని.. చేయమన్నది చేసిన వారికి.. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ మంచి మార్కులు పడ్డాయి. పడుతున్నాయి. గతంలో అనిత..డాక్టర్ సుధాకర్ వ్యవహారం పై హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఆమెకు మంచి మార్కులు వేశారు. ఇలా.. నాయకులు ప్రజల సమస్యలపై స్పందించాలని కోరుకుంటున్నారు. కానీ, కొందరు నాయకులు పదవులు పట్టుకుని వేలాడేందుకు ప్రయత్నించడమే బాబుకు నచ్చడం లేదు.
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…