Political News

‘ఆప‌రేషన్ పార్ల‌మెంట్‌’.. మామూలుగా ఉండ‌దు!

భార‌త పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు.. ఈ నెల 21వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఆగ‌స్టు వ‌ర‌కు దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా కీల‌క‌మైన ప‌లు బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు రెడీ అయింది. వీటిలో వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్షన్‌తో పాటు.. జ‌న గ‌ణ‌న‌తోపాటు కుల గ‌ణ‌న చేప‌ట్టే బిల్లుల‌ను కూడా కేంద్రం తీసుకురానుంది. జ‌న గ‌ణ‌న‌కు అయితే.. చ‌ట్టం అవ‌స‌రం లేక‌పోయినా.. దీంతోపాటు క‌లిపి కుల గ‌ణ‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో బిల్లు ప్రిపేర్ చేస్తున్నారు.

ఇది స‌ర్కారు వైపు స్టోరీ. కానీ, ప్ర‌తిప‌క్షాల విష‌యానికి వ‌స్తే.. పార్లమెంటు వేదిక‌గా ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’.. అనంత‌ర ప‌రిణామాల‌ పై అట్టుడికించ‌నున్నారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఏప్రిల్ 22న జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాం ప‌ర్యాట‌క ప్రాంతంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. ఆనాటి దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. దీనికి ప్ర‌తిగా.. భార‌త్‌.. ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు చేసి 9 చోట్ల ఉగ్ర‌వాదుల శిబిరాల‌ను నేల మ‌ట్టం చేసింది.

ముఖ్యంగా జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ అధినేత కుటుంబాన్ని తుద‌ముట్టించింది. దీని వ‌ర‌కు ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ.. అస‌లు ఉగ్ర‌వాద దాడికి ముందు.. త‌ర్వాత ప‌రిణామాల‌ పై ప్ర‌తిప‌క్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉగ్ర‌వాద దాడి జ‌రిగిన ఏప్రిల్ 22 స‌మ‌యంలో ప్ర‌ధాని విదేశాల్లో ఉన్నారు. ఆయ‌న అంత‌కు ముందు రోజు విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నార‌న్న‌ది ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలో ముందుగానే ప‌హ‌ల్గాం దాడి గురించి మోడీకి తెలుసున‌న్న‌దివారి వాద‌న‌.

ఇక‌, ఆప‌రేషన్ సిందూర్ ను అర్ధంత‌రంగా ముగించ‌డం వెనుక అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఉన్నార‌ని.. ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భార‌త్‌పై సుంకాలు విధిస్తామ‌ని.. వాణిజ్యం నిలుపుద‌ల చేస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతోనే దారికి వ‌చ్చార‌న్న‌ది ఆయ‌న చెప్పిన మాట‌. అప్ప‌టి నుంచి దీనిపై కేంద్రం స‌మాధానం కోసం ప్ర‌తిప‌క్షాలు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా మోడీ స్పంద‌న కోసం చూస్తున్నాయి.

కానీ, ఆయ‌న ఎక్క‌డా స్పందించ‌డం లేదు. ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌య‌వంతం కావ‌డాన్ని చెప్పుకొస్తున్నారే త‌ప్ప‌.. దీనిలో తృతీయ దేశ ప్ర‌మేయం పై నోరు విప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో ఆప‌రేష‌న్ సిందూర్ పూర్వం.. త‌ర్వాత ప‌రిణామాల‌పై పార్ల‌మెంటు వేదిక‌గా.. ప్ర‌తిప‌క్షాలు నిప్పులు చెరిగేందుకు ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. అందుకే ఈ ద‌ఫా ‘ఆప‌రేష‌న్ పార్లమెంటు’ స‌మావేశాలుగా మారుతాయ‌ని అంటున్నారు.

This post was last modified on July 4, 2025 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

44 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago