Political News

ఏడాది దాటినా ఇంకా పాత పాటలేనా..?

భారత దేశంలో రాజకీయ పార్టీలు భలే చిత్రంగా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈవీఎంలకు మద్దతుగా నిలిస్తే… ఓడిన పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తూ బ్యాలెట్ పద్దతిన ఓటింగ్ జరగాలంటూ డిమాండ్ చేస్తాయి. అంతేకాదండోయ్… ఇప్పుడు గెలిచిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడితే… ఆ పార్టీ కూడా తన మాట మార్చేసి తనకూ బ్యాలెట్ ఓటింగే కావాలని డిమాండ్ చేస్తుంది. ఈ తరహా విచిత్ర పరిస్థితి మన వద్దే కనిపిస్తుంది. సంచలన రాజకీయాలకు నెలవుగా మారిన ఏపీలో అయితే ఈ తరహా డిమాండ్లు మరింతగా గట్టిగా వినిపిస్తాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే మోడ్ లో ఉంది.

ఏపీ సహా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగి అప్పుడే ఏడాది దాటిపోతోంది. ఆపై ఇంకో నెల కూడా గడుస్తోంది. ఇలాంటి తరుణంలోనూ వైసీపీ తన పాత పాటనే పాడుతూ ఢిల్లీ వీథుల్లో కామెడీ పంచుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినంతనే ఎన్నికలు సజావుగా జరిగాయని, కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వైసీపీ ప్రకటించింది. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఓటమి ఎదురు కావడంతో ఈవీఎంలతో తమను మోసం చేశారని, ఎన్నికల సంఘం కూడా కూటమికే సహకరించిందని ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఈసీకి తెలిపింది.

ఈ విషయంలో వైసీపీ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అయితే ఏకంగా ఎన్నికల సంఘానికి ఓ బలమైన ఫిర్యాదే చేశారు. ఈ ఫిర్యాదును నాడే పరిశీలించిన ఎన్నికల సంఘం… అందులో వాస్తవమేమీ లేదని, అదంతా సర్వసరాధారణమని, మీరే పొరబడుతున్నారని తెలిపింది. అయినా కూడా బెల్లాన వినలేదు. తన ఫిర్యాదుపై విచారణ జరగాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. సరే…సమయం చూసుకుని పిలుస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇతరత్రా పనులు ముగించుకుని కాస్తంత విశ్రాంతి దొరికినట్లుంది… గురువారం రావాలంటూ ఎన్నికల సంఘం వైసీపీకి సమాచారం పంపింది.

ఈ పిలుపుతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్ సభలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలతో కలిసి బెల్లాన గురువారం ఉదయం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లారు. తమ వద్ద ఉన్న ఆధారాలను వారు సంఘం ప్రతినిధులకు అందజేశారు. వాటిపై ఎన్నికల సంఘం ఏం సమాధానం చెప్పిందో తెలియదు గానీ… సమావేశాన్ని ముగించుకుని బయటకు వచ్చిన వైసీపీ నేతలు… 2024 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఇకపై బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

This post was last modified on July 3, 2025 9:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

1 hour ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

5 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

5 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

5 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

6 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

6 hours ago