Political News

అరుణమ్మకు ప్ర‌మోష‌న్‌.. బీజేపీ స్ట్రాట‌జీ

తెలంగాణ బీజేపీలో ప‌ద‌వుల పందేరం కొన‌సాగుతోంది. తాజాగా రామ‌చంద‌ర్‌రావుకు రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించిన అధిష్టానం.. ఈ పోస్టును ఆశించిన ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌ను సంతృప్తి ప‌రిచేందుకు మ‌రో రూపంలో వారికి ప్ర‌మోష‌న్ ఇస్తోంది. ఈ జాబితాలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంటు ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మాజీ మంత్రి డీకే అరుణ‌కు కీల‌క ప‌దవిని ఇచ్చింది. అంతేకాదు.. ఇప్ప‌టికే ఆమెకు రెండు ప‌ద‌వులు ఉన్నా.. ఇప్పుడు మూడో ప‌ద‌విని కట్ట‌బెట్ట‌డం ద్వారా ఫైర్ బ్రాండ్ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు అయింది. త‌ద్వారా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో బీజేపీని పుంజుకునేలా చేస్తోంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న డీకే అరుణ‌కు.. ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణ ఛైర్మన్ కూడా గ‌తంలో ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా కూడా అరుణ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఆమె రాష్ట్ర పార్టీ ప‌గ్గాల‌ను ఆశించార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. దీని కోస‌మే గ‌త నెల‌లో వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి.. మ‌రీ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌భ్యురాలిగా నియ‌మించారు. ఈ ప‌ద‌విలో ఆమె మూడు సంవ‌త్స‌రాలు కొన‌సాగుతారు. బీజేపీలో కీల‌క‌మైన జాతీయ కౌన్సిల్ పార్టీకి కీల‌క స‌మాచారం ఇవ్వ‌డంతోపాటు.. సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా ఇస్తుంది.

ఇక‌, ఇదే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పద్మజారెడ్డికి కూడా పార్టీ ప్ర‌మోష‌న్ ఇచ్చింది. ఆమెను కూడా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా తీసుకున్నారు. ఆమె కూడా ఈ ప‌ద‌విలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఇలా.. బీజేపీ ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు మించి నాయ‌కుల‌ను ప‌ద‌వుల్లోకి తీసుకోవ‌డం వెనుక‌ మహబూబ్‌నగర్ జిల్లాపై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్న‌ట్టుగా ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌కుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. వీరితోపాటు ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు జాతీయ‌స్థాయిలో ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా పార్టీని పుంజుకునేలా చేస్తార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

8 hours ago