ఆయన వైసీపీ నాయకుడు. పైగా ఫైర్ బ్రాండ్. మాజీ మంత్రి. నోరు విప్పితే.. టీడీపీ పై విమర్శల పర్వం. జనసేన పై ఘాటు వ్యాఖ్యలు. ఇదీ… గత ఐదేళ్లలో సదరు నాయకుడు చేసిన రాజకీయం. దీంతో కూటమి లో నాయకులకు ఆయనంటే కంటగింపు. అవకాశం-అవసరం కోసం ఎదరు చూశారు. ఎప్పుడెప్పుడు అవకాశం దక్కుతుందా? ఎప్పుడెప్పుడు.. కసి తీర్చుకుందామా? అని కూడా లెక్కలు వేసుకున్నారు. తీరా గత ఏడాదే ఇలాంటి వారికి అవకాశం చిక్కింది.
కూటమి ప్రభంజనంలో సదరు నాయకుడు మైనస్ అయ్యారు. ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఆయనే నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్. ఈయన పై టీడీపీలో ఉన్న అందరికీ కోపమే. కసి తీర్చుకోవాలన్న ఆత్రమే. ఒక్క నెల్లూరులోనే కాదు.. ఉమ్మడి కృష్ణా సహా.. ఉమ్మడి శ్రీకాకుళంలోని టీడీపీ నాయకులకు కూడా అనిల్ అంతు చూడాలనే ఉంది. ఇక, నెల్లూరులో అయితే.. ఈ చర్చ మరింత ఎక్కువగా ఉంది.
గతంలో తమను సవాల్ చేయడంతోపాటు.. తమ పై తీవ్రంగా దూషించారని టీడీపీ సీనియర్లు కూడా ఆవే దనలోనే ఉన్నారు. ఇక, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్లోనూ ఆయన పేరు ఉందని అంటారు. కానీ..ఆ పార్టీ ఓడిపోయి ఏడాదైనా.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా.. అనిల్పై ఈగ కూడా వాలలేదు. అంతేకాదు.. అసలు ఆయన ప్రస్తావనే లేకుండా పోయింది. మరి దీనికి కారణమేంటి? ఎందుకు? అనేది ఆసక్తికర చర్చ. అసలు ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా.. ఆయనను ఏమీ చేయబోరని అంటున్నారు.
దీనికి కారణం.. ఇద్దరు కీలక సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు అనిల్ వెనుక చక్రం తిప్పుతున్నారట. ఆయనను అన్ని విధాలా రక్షించేస్తున్నారట. గతంలో అందరూ ఒకే పార్టీలో ఉన్న సమయంలో తమకు అన్నివిధాలా మేలు చేసిన అనిల్ను ఇప్పుడు వారే కాపాడుతున్నారని ఒక టాక్ నడుస్తోంది. అయితే.. ఆ ఎంపీలు ఎవరన్నది మాత్రం గోప్యంగా ఉంది.
కానీ.. వారు అందరికీ తెలిసిన వారేనని అంటున్నారు. వారికి గతంలో అనిల్ సాయం చేయడం.. (మంత్రిగా ఉన్నప్పుడు), వారితో ఉన్న వ్యక్తిగత అనుబంధాల కారణంగానే అనిల్ను ఇప్పుడు కాపాడుతున్నారని.. అందుకే ఈగ కూడా వాలడం లేదని చెబుతున్నారు. మరి ఈ రక్షణ ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.
This post was last modified on July 2, 2025 4:09 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…