పార్టీలో ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇపుడిదే చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ మాజీ ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు @ మాగంటి బాబు ఇప్పుడెక్కడా కనబడటం లేదట. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎంపి కనబడటం లేదంటే సరేలే అని సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు దగ్గర కూడా కనబడటం లేదట. జిల్లాలోని మాజీ మంత్రులు, సీనియర్ నేతలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు కానీ ఈయనగారు మాత్రం ఎక్కడ అడ్రస్ ఉండటం లేదనే టాక్ పెరిగిపోతోంది.
అయితే ఇదే సమయంలో మాజీ ఎంపి అనుచరులు ఎదురుదాడి మొదలుపెట్టారు. తమ నేతను చంద్రబాబే దూరంగా పెట్టేశారు కాబట్టే తమ నేత కూడా ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతున్నారని చెబుతున్నారు. రెండు వాదనల్లో ఏది నిజమో తెలియాలంటే ఇటు చంద్రబాబు కానీ లేకపోతే అటు మాగంటి బాబు కానీ ఎవరో ఒకరు నోరిప్పాల్సిందే. విషయం ఏమైనా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనేది వాస్తవం. ఎందుకంటే ఏలూరు పార్లమెంటు నియజకవర్గం అధ్యక్షునిగా అందరు మాగంటి బాబును నియమిస్తారని అనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మాజీ ఎంఎల్ఏ గన్ని వీరాంజనేయులుని నియమించారు.
చంద్రబాబు చేసిన నియామకంతో ముందు అందరు ఆశ్చర్యపోయారు. తర్వాత అధినేతకు, తమ నేతకు గ్యాప్ వచ్చింది నిజమే అనే నిర్ధారణకు వచ్చారు. లేకపోతే మాజీ ఎంపి అందులోను పార్టీకి లాయల్ నేతగా పేరుతెచ్చుకున్న మాగంటిని కాదని చంద్రబాబు వేరొకళకి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు చేసిన పని కారణంగా మాగంటి పార్టీకి దూరంగానే ఉంటున్నారట.
దాంతో ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలనే విషయమై మాగంటి తన మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఒకవేళ టీడీపీని వదిలేస్తే ఏ పార్టీలో చేరాలి ? అన్నదే ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోందట. బీజేపీలో చేరితే పెద్దగా ఉపయోగం ఉండదన్న ఆలోచనలో మాగంటి ఇఫ్పటికే ఉన్నారట. ఇక మిగిలిన ఆప్షన్ కూడా వైసీపీ తప్ప మరోటి కనబడటం లేదు. అయితే అదికార పార్టీలో చేరితే తనకు గౌరవం ఉంటుందా ? అన్నదే అనుమానమట. మరి ఏ పార్టీలో చేరాలనే విషయమై తొందరలోనే మాగంటి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అనుచరులు చెప్పుకుంటున్నారు. చూద్దాం మాగంటి ఏమి నిర్ణయం తీసుకుంటారో ?
This post was last modified on November 14, 2020 2:17 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…