Political News

ఆ విష‌యం తేల్చ‌కుండా.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డారు!

వైసీపీ నాయ‌కుల్లో ఇప్పుడు ఈ చ‌ర్చే సాగుతోంది. ఆ విష‌యం తేల్చ‌కుండా.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డా రంటూ.. మెజారిటీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నాయ‌కులు గ‌డప దాట‌డంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు.. జ‌గ‌న్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాటిపోయింది. ఇంటింటికీ వెళ్లి.. సీఎం చంద్రబాబు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను గుర్తు చేయాల‌ని.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వంపై ఉసి గొల్పాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

దీనికి ఆయ‌న ఐదు వారాల గ‌డువు కూడా విధించారు. అయితే.. అస‌లు విష‌యం ఏంటంటే.. గ‌త ఎన్నికల స‌మ‌యంలో జ‌గ‌న్ 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ లో ఇదే న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే విష్ణును త్రిశంకు స్వ‌ర్గంలో ఉంచిన‌ట్టు ఉంచారు. అయితే.. వెల్లంప‌ల్లి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న యాక్టివ్‌గా కూడా ఉండ‌డం లేదు.

మ‌రోవైపు ప‌శ్చిమ‌లో మైనారిటీ ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న కూడా ఓడిపోయారు. త‌ర్వాత‌.. అస‌లు ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా తెలియ‌డం లేదు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఎన్నిక‌లు ముగిసి ఏడాది అయినా.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లను నియ‌మించ‌లేదు. పైగా.. ఓడిపోయిన వారిని యాక్టివ్ కూడా చేయ‌లేదు. పోనీ.. పాత‌వారిని తిరిగి వారి వారి స్థానాల‌కు కూడా పంపించ‌లేదు.

ఒక‌టి రెండు చోట్ల(ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు(ఎస్సీ), చిల‌క‌లూరిపేట‌(జ‌న‌ర‌ల్‌) అలా నియ మించినా.. వారు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో బాధ్య‌త‌ల‌పై పార్టీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకోకుండా.. ఇంటింటికీ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డంపై నాయ‌కులు విస్మ యం వ్య‌క్తం చేస్తున్నారు. ముందుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేర్పు లు చేసిన త‌ర్వాత‌.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిస్తే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం తాడికొండ స‌హా ప‌లు చాలా నియోజ‌క వ‌ర్గాల్లో నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. కాబట్టి జ‌గ‌న్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ పై నిర్ణ‌యం తీసుకోవాల‌న్నది వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on June 30, 2025 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago