Political News

ఆ విష‌యం తేల్చ‌కుండా.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డారు!

వైసీపీ నాయ‌కుల్లో ఇప్పుడు ఈ చ‌ర్చే సాగుతోంది. ఆ విష‌యం తేల్చ‌కుండా.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డా రంటూ.. మెజారిటీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నాయ‌కులు గ‌డప దాట‌డంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు.. జ‌గ‌న్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాటిపోయింది. ఇంటింటికీ వెళ్లి.. సీఎం చంద్రబాబు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను గుర్తు చేయాల‌ని.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వంపై ఉసి గొల్పాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

దీనికి ఆయ‌న ఐదు వారాల గ‌డువు కూడా విధించారు. అయితే.. అస‌లు విష‌యం ఏంటంటే.. గ‌త ఎన్నికల స‌మ‌యంలో జ‌గ‌న్ 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ లో ఇదే న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే విష్ణును త్రిశంకు స్వ‌ర్గంలో ఉంచిన‌ట్టు ఉంచారు. అయితే.. వెల్లంప‌ల్లి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న యాక్టివ్‌గా కూడా ఉండ‌డం లేదు.

మ‌రోవైపు ప‌శ్చిమ‌లో మైనారిటీ ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న కూడా ఓడిపోయారు. త‌ర్వాత‌.. అస‌లు ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా తెలియ‌డం లేదు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఎన్నిక‌లు ముగిసి ఏడాది అయినా.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లను నియ‌మించ‌లేదు. పైగా.. ఓడిపోయిన వారిని యాక్టివ్ కూడా చేయ‌లేదు. పోనీ.. పాత‌వారిని తిరిగి వారి వారి స్థానాల‌కు కూడా పంపించ‌లేదు.

ఒక‌టి రెండు చోట్ల(ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు(ఎస్సీ), చిల‌క‌లూరిపేట‌(జ‌న‌ర‌ల్‌) అలా నియ మించినా.. వారు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో బాధ్య‌త‌ల‌పై పార్టీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకోకుండా.. ఇంటింటికీ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డంపై నాయ‌కులు విస్మ యం వ్య‌క్తం చేస్తున్నారు. ముందుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేర్పు లు చేసిన త‌ర్వాత‌.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిస్తే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం తాడికొండ స‌హా ప‌లు చాలా నియోజ‌క వ‌ర్గాల్లో నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. కాబట్టి జ‌గ‌న్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ పై నిర్ణ‌యం తీసుకోవాల‌న్నది వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on June 30, 2025 5:59 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

2 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

4 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

6 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

9 hours ago