Political News

ఎంఎల్ఏలకు జగన్ క్లాసు పీకారా ?

ఇద్దరు ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసు పీకారా ? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. విశాఖపట్నం జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఎంఎల్ఏలు, ఎంపి మధ్య వాగ్వాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. భూమి లావాదేవీల విషయంలో చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ-రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పెద్ద వాగ్వాదమే జరిగింది. జిల్లాలోని అధికారులు, టీడీపీ ఎంఎల్ఏల మందు వీళ్ళద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. అయితే ఇద్దరిలో ఎవరు కూడా మరొకరి పేరు ఎత్తకుండానే వాదులాడుకున్నారు.

రాజకీయ నేతలు భూములను ఆక్రమించుకుంటున్నారంటూ ఎంపి పదే పదే వ్యాఖలు చేశారు. దాంతో ధర్మశ్రీ మాట్లాడుతు రాజకీయనేతలు అంటూ అందరినీ ఒకే గాటన కట్టవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా భూములు ఆక్రమించుకుని ఉంటే నేరుగా వాళ్ళ పేర్లు చెప్పాలంటూ ఎంఎల్ఏ డిమాండ్ చేశారు. ఒకరిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరినీ అవమానించేట్లుగా మాట్లాడటం తగదంటు ధర్మశ్రీ ఎంపిని తీవ్రంగా ఆక్షేపించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాం జరిగింది.

ఇదైపోయిన తర్వాత అనకాపల్లి ఎంఎల్ఏ గుడవాడ అమరనాధ్ కు ఎంపికి మధ్య ఇదే విషయమై మళ్ళీ వివాదం జరిగింది. దాంతో సమావేశంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకాలేదు. అధికారపార్టీ, ఎంపిలేమిటి భూ ఆక్రమణలపై బహిరంగంగానే ఆరోపణలు, వాగ్వాదాలు చేసుకోవటం ఏమిటి అనే విషయంపై అయోమయం మొదలైంది. ఈ విషయంపై తర్వాత జగన్ కు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. దాంతో ఎంఎల్ఏలు ఇద్దరినీ జగన్ తాడేపల్లికి పిలిపించారట.

సమీక్షా సమావేశంలో ఎంపితో జరిగిన వాగ్వావాదంపై వివరాలు తెలుసుకుని తర్వాత ఫుల్లుగా క్లాసు పీకారని సమాచారం. విజయసాయిరెడ్డి అంటేనే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జగన్ తర్వాత నెంబర్ 2 అనే విషయాన్ని బహుశా ఎంఎల్ఏలు మరచిపోయేరామో. పైగా ఎంపి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డితో బహిరంగంగా ఎంఎల్ఏలు వాగ్వాదానికి దిగితే జగన్ సహిస్తారా ? ఇదే విషయాన్ని వాళ్ళకు గుర్తుచేసి క్లాసు పీకినట్లు ప్రచారం జరుగుతోంది.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

4 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

5 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

6 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

6 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

7 hours ago