Political News

ఎంఎల్ఏలకు జగన్ క్లాసు పీకారా ?

ఇద్దరు ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసు పీకారా ? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. విశాఖపట్నం జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఎంఎల్ఏలు, ఎంపి మధ్య వాగ్వాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. భూమి లావాదేవీల విషయంలో చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ-రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పెద్ద వాగ్వాదమే జరిగింది. జిల్లాలోని అధికారులు, టీడీపీ ఎంఎల్ఏల మందు వీళ్ళద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. అయితే ఇద్దరిలో ఎవరు కూడా మరొకరి పేరు ఎత్తకుండానే వాదులాడుకున్నారు.

రాజకీయ నేతలు భూములను ఆక్రమించుకుంటున్నారంటూ ఎంపి పదే పదే వ్యాఖలు చేశారు. దాంతో ధర్మశ్రీ మాట్లాడుతు రాజకీయనేతలు అంటూ అందరినీ ఒకే గాటన కట్టవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా భూములు ఆక్రమించుకుని ఉంటే నేరుగా వాళ్ళ పేర్లు చెప్పాలంటూ ఎంఎల్ఏ డిమాండ్ చేశారు. ఒకరిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరినీ అవమానించేట్లుగా మాట్లాడటం తగదంటు ధర్మశ్రీ ఎంపిని తీవ్రంగా ఆక్షేపించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాం జరిగింది.

ఇదైపోయిన తర్వాత అనకాపల్లి ఎంఎల్ఏ గుడవాడ అమరనాధ్ కు ఎంపికి మధ్య ఇదే విషయమై మళ్ళీ వివాదం జరిగింది. దాంతో సమావేశంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకాలేదు. అధికారపార్టీ, ఎంపిలేమిటి భూ ఆక్రమణలపై బహిరంగంగానే ఆరోపణలు, వాగ్వాదాలు చేసుకోవటం ఏమిటి అనే విషయంపై అయోమయం మొదలైంది. ఈ విషయంపై తర్వాత జగన్ కు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. దాంతో ఎంఎల్ఏలు ఇద్దరినీ జగన్ తాడేపల్లికి పిలిపించారట.

సమీక్షా సమావేశంలో ఎంపితో జరిగిన వాగ్వావాదంపై వివరాలు తెలుసుకుని తర్వాత ఫుల్లుగా క్లాసు పీకారని సమాచారం. విజయసాయిరెడ్డి అంటేనే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జగన్ తర్వాత నెంబర్ 2 అనే విషయాన్ని బహుశా ఎంఎల్ఏలు మరచిపోయేరామో. పైగా ఎంపి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డితో బహిరంగంగా ఎంఎల్ఏలు వాగ్వాదానికి దిగితే జగన్ సహిస్తారా ? ఇదే విషయాన్ని వాళ్ళకు గుర్తుచేసి క్లాసు పీకినట్లు ప్రచారం జరుగుతోంది.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

6 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

6 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

7 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

7 hours ago