ఇంటింటికి వైసీపీ పేరుతో వైసిపి అధినేత జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక లక్ష నిర్దేశం చేశారు. రాజకీయాల్లో ప్రజలను కలుసుకోవడం, ప్రజా సమస్యల ప్రస్తావించడం, వారి సమస్యలపై పోరాటం చేయటం అనేది ప్రతిపక్షంగా నాయకులు చేయాల్సిన కర్తవ్యం. వాస్తవానికి చెప్పాలంటే 2019లో టిడిపి అధినేత చంద్రబాబు కేవలం 6 మాసాల గడువు లోపే ప్రజల మధ్యకు వచ్చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబట్టారు. ఆయనతో పోల్చి చూసుకుంటే జగన్ చాలా లేట్ చేశారని చెప్పాలి.
ఇప్పటికే పలుమార్లు ప్రజల మధ్యకు వస్తానని చెప్పి ఆయన రాకపోవడం, నాయకులను, కార్యకర్తలను పంపించే ప్రయత్నం చేసిన అది కూడా సక్సెస్ కాకపోవడం వంటివి పార్టీలోను బయట రాజకీయ వర్గాల్లోనూ చర్చ గా మారింది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు మేనిఫెస్టోను రీకాల్ చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లాలని జగన్ పెట్టుకున్న లక్ష్యంగా కనిపించింది. తద్వారా 2024 ముందు ఇచ్చినటువంటి హామీలు, చేస్తామన్న పనులు, ఎన్నికల తాయిలాలు వంటివి తిరిగి ప్రజలకు గుర్తు చేయాలనేది జగన్మోహన్ పెట్టుకున్న లక్ష్యం.
అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు విఫలం అవుతుంది అనేది పక్కన పెడితే కీలకమైన వైసిపి ఓటు బ్యాంకుకు మాత్రం ఇది ఎంతో కొంత మేలు చేస్తుంది అనేది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎలా అంటే.. గత ఎన్నికల్లో జగన్ కన్నా ఎక్కువగా తమకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో వైసిపికి అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలు టిడిపికి ఓటు వేసి ఉంటే లేదా కూటమికి ఓటు వేసి ఉంటే ఇప్పుడు ఆయా వర్గాలు తిరిగి వైసిపికి అనుకూలంగా మారేందుకు ఈ ఇంటింటికి కార్యక్రమం కచ్చితంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
తద్వారా ఇది భవిష్యత్తులో వైసీపీకి మేలు చేస్తుంది అనేది పరిశీలకుల అంచనా. ఇది పూర్తి స్థాయిలో మేలు చేస్తుందా.. పరోక్షంగా మేలు చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తానికి ప్రజల్లోకి అయితే వైసీపీకి ఒక ఇమేజ్ పెరుగుతుందనేది, అదే విధంగా కూటమి సర్కారుకు కూడా మరోవైపు ఒత్తిడి పెరిగి పథకాలను అమలు చేయడమా లేకపోతే ఎదురు దాడి చేయడం అనేది తేల్చుకునే పరిస్థితి వస్తుందని అంచనా కూడా వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా జగన్ చాలా వ్యూహాత్మకంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు.
సహజంగా ఇదే కార్యక్రమాన్ని ఒక ఆరు నెలల ముందే ప్రారంభించి ఉంటే ఆ ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఏడాది తర్వాత ఇచ్చిన హామీలపై నిలదీయాలని లేదా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునివ్వడం ద్వారా వైసిపి వ్యూహం పనిచేయనుంది. ఇది ఒక రకంగా పార్టీకి ఉపయోగపడుతుంది. ఇక ప్రభుత్వం పరంగా ఎదురయ్యే సమస్యలు ప్రభుత్వం ఎలా డిఫెన్స్ చేసుకుంటుంది అనేది ఆ పార్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష కోణంలో చూసినప్పుడు జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం లో ఎలాంటి తప్పుగాని అతిశయోక్తిగాని ఏమాత్రం లేదని చెప్పాలి.
This post was last modified on June 26, 2025 4:09 pm
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…