Political News

ర‌ఘురామ ఆగ్ర‌హించిన వేళ‌.. ఏం జ‌రిగింది?

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు రాజ‌కీయ నాయ‌కుడిగానే కాకుండా.. విశ్లేష‌ణా ప‌రుడిగా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే త‌త్వం ఉన్న వ్య‌క్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. పార్టీలు ఏవైనా.. ప‌ద‌వులు ఎన్నున్నా.. ఆయ‌న శైలిలో మాత్రం మార్పు పెద్ద‌గా క‌నిపించ‌దు. ఉన్న‌ది ఉన్న‌ట్టు.. కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డమే ఆయ‌న నైజం. ఇది కొంద‌రికి న‌చ్చొచ్చు.. కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అయినా.. ర‌ఘురామ మాత్రం చెప్పాల్సింది చెప్పేస్తారు. గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి పాల‌న‌పై రోజు నిప్పులు చెరిగేవారు. ప్ర‌జ‌ల కోణంలో ఆలోచించాల‌ని చెప్పేవారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చాక కూడా.. ఒక‌టి రెండు సార్లు చిరు కోపం ప్ర‌ద‌ర్శించారు. అది కూడా.. అధికారుల ప‌నితీరు స‌రిగాలేద‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. ఒక‌రిద్ద‌రు అధికారులు చేసే పనుల కారణంగా యావ‌త్ కూట‌మి ప్ర‌భుత్వం కూడా అభాసుపాల‌వుతుంద‌న్న ఆవేద‌న ఆయ‌న మాట‌ల్లో క‌నిపించింది. తాజాగా ఇలాంటి విష‌యంపైనే ర‌ఘురామ మ‌రోసారి ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. చిరు కోపం ప్ర‌ద‌ర్శించారు. “ఇలా అయితే.. ఎలా!” అంటూ సుతిమెత్తగా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఒకింత గ‌ట్టిగానే హెచ్చ‌రించారు.

ఇంత‌కీ ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అమ‌రావతిలో ‘సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు’ పేరిట కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని.. ఎమ్మెల్యేల‌కు అవ‌మానం జ‌రిగింద‌ని ర‌ఘురామ చిరు కోపం ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు.. స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌ల‌కు అస‌లు ఆహ్వానం కూడా లేకపోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేద‌న్నారు.

తాను ఈ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌లేద‌న్న ర‌ఘురామ‌.. ఒక‌వేళ వెళ్లి ఉంటే.. అక్క‌డి ప‌రిస్థితులు చూసి మ‌ధ్య‌లో నే బ‌య‌ట‌కు వ‌చ్చేసి ఉండేవాడిన‌ని వ్యాఖ్యానించారు. “కలెక్టర్‌, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్‌ వద్ద కూర్చోబెట్టారు. మరో టేబుల్‌ వద్ద కార్పొరేషన్‌ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారు. ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఎంపీ, ఎమ్మెల్యేలు.. అధికారుల‌కు వేర్వేరుగా సీటింగ్ ఉండాలి. అంటే ప్రొటోకాల్ పాటించ‌లేదు. ఇది స‌రికాదు. నేను వెళ్లి ఉంటే .. మ‌ధ్య‌లోనే వ‌చ్చేసేవాడిని. ఈ విషయాన్ని కొంద‌రు ఎమ్మెల్య‌లు నాకు చెప్పారు. ” అని ర‌ఘురామ పేర్కొన్నారు.

This post was last modified on June 26, 2025 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

31 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

1 hour ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

5 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

5 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

5 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago