ఏపీ సీఎం చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం అందుతోంది. పనులు వేగం గా పూర్తవుతున్నాయి. ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందుతున్నాయి. ఇలా.. కలిసొచ్చే కాలంగా చంద్రబాబుకు అన్నీ సకాలంలో జరుగుతు న్నాయి. ఇక, ఇప్పుడు కీలకమైన ఫిక్కీ కూడా.. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు వచ్చింది.
ఏంటీ ఫిక్కీ..
ఫిక్కీ అంటే.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య. భారీ ఎత్తున పరిశ్రమలకు అధిపతులుగా ఉన్నవారు… దీనిలో సభ్యులుగా ఉంటారు. తాజాగా వీరు విజయవాడలో సమావేశం అయ్యారు. దీనికి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా సహకరిస్తామని.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామని తేల్చి చెప్పారు.
ముఖ్యంగా పీ-4 పథకం పై ఫిక్కీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు మక్కువ చూపించారు. ప్రధానం గా సర్ణాంధ్ర- 2047 విజన్ పై ఆసక్తి చూపించారు. దీనికి పూర్తిస్థాయిలో తమ సహకారం ఉంటుందని తేల్చి చెప్పారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విషయంలో దోహదపడతామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేలా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఖుషీ అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. పెట్టుబడులు పెట్టేవారికి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయనున్నట్టు వివరించారు. దీంతో ఫిక్కీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
This post was last modified on June 25, 2025 3:28 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…