ఏపీ సీఎం చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం అందుతోంది. పనులు వేగం గా పూర్తవుతున్నాయి. ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందుతున్నాయి. ఇలా.. కలిసొచ్చే కాలంగా చంద్రబాబుకు అన్నీ సకాలంలో జరుగుతు న్నాయి. ఇక, ఇప్పుడు కీలకమైన ఫిక్కీ కూడా.. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు వచ్చింది.
ఏంటీ ఫిక్కీ..
ఫిక్కీ అంటే.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య. భారీ ఎత్తున పరిశ్రమలకు అధిపతులుగా ఉన్నవారు… దీనిలో సభ్యులుగా ఉంటారు. తాజాగా వీరు విజయవాడలో సమావేశం అయ్యారు. దీనికి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా సహకరిస్తామని.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామని తేల్చి చెప్పారు.
ముఖ్యంగా పీ-4 పథకం పై ఫిక్కీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు మక్కువ చూపించారు. ప్రధానం గా సర్ణాంధ్ర- 2047 విజన్ పై ఆసక్తి చూపించారు. దీనికి పూర్తిస్థాయిలో తమ సహకారం ఉంటుందని తేల్చి చెప్పారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విషయంలో దోహదపడతామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేలా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఖుషీ అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. పెట్టుబడులు పెట్టేవారికి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయనున్నట్టు వివరించారు. దీంతో ఫిక్కీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
This post was last modified on June 25, 2025 3:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…