Political News

ఎమ‌ర్జెన్సీకి 50 ఏళ్లు.. అస‌లేంటింది? ఏం జ‌రిగింది?

దేశంలో ఎమ‌ర్జెన్సీ.. అంటే అత్య‌యిక స్థితిని విధించి జూన్ 25 (బుధ‌వారం) నాటికి 50 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణ‌యం.. దేశ చ‌రిత్ర‌లో ఒక చీక‌టి అధ్యాయంగా నిలిచిపోయింది. అంతేకాదు, గాంధీల కుటుంబ చ‌రిత్ర‌లో కూడా ఇది మాయ‌మైన మ‌చ్చ‌గా మారింది. మ‌రి అస‌లు ఎమ‌ర్జెన్సీ అంటే ఏంటి? ఎందుకు విధించారు? అప్ప‌ట్లో ఏం జ‌రిగింది? అనే కీల‌క విష‌యాలు ఇప్పుడు చూద్దాం..

ఎమ‌ర్జెన్సీ అంటే ఏంటి?

భార‌త రాజ్యాంగంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని ప్ర‌జాస్వామ్య దేశాల రాజ్యాంగాల్లోనూ ఎమ‌ర్జెన్సీ అనే నిబంధ‌న లేదా ఆర్టిక‌ల్ ఉంటుంది. ఆయా దేశాల్లో అంత‌ర్యుద్ధాలు జ‌రిగిన‌ప్పుడు, తీవ్ర‌ స్థాయి మ‌త క‌ల‌హాలు, జ‌న హ‌న‌నాల‌కు అవ‌కాశం ఉన్న‌ప్పుడు, ప్ర‌జ‌లు క‌ల్లోల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే స్థితి నెల‌కొన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వాల సిఫార‌సు మేర‌కు రాష్ట్ర‌ప‌తి ఎమర్జెన్సీని విధిస్తారు. త‌ద్వారా అధికారం మొత్తం రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతుంది. ఇదీ ఎమ‌ర్జెన్సీకి అర్ధం.

మన దేశంలో..

మన దేశ రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ 352(1) ఎమ‌ర్జెన్సీని నిర్వ‌రించింది. దీనికి కొన్ని ప‌రిమితులు, హ‌ద్దులు కూడా ఉన్నాయి. కేంద్రం సిఫార‌సు చేసే స‌మ‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. పైగా దేశంలోని 75 శాతం రాష్ట్రాల్లో అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్పుడు మాత్ర‌మే, అది కూడా ప‌రిమిత రోజుల‌కు మాత్ర‌మే ఎమ‌ర్జెన్సీని విధించాల‌ని పేర్కొంది. దీనిపై పూర్తి బాధ్య‌త రాష్ట్ర‌ప‌తిపైనే ఉంటుంది. కేంద్రం సిఫార‌సు చేసినా, దీనిని తిర‌స్క‌రించ‌డానికి లేదా అనుమ‌తించ‌డానికి సంపూర్ణ అధికారాలు రాష్ట్ర‌ప‌తికే ఉన్నాయి.

ఇందిర‌మ్మ హ‌యాంలో..

మన దేశంలో ఎమ‌ర్జెన్సీని 1975 జూన్ 25 అర్ధ‌రాత్రి నుంచి 1977 మార్చి 21 వ‌ర‌కు విధించారు. ఇది ప్ర‌పంచ ప్రజాస్వామ్య దేశాల‌లోనే అత్య‌ధిక కాలం విధించిన ఎమ‌ర్జెన్సీగా చ‌రిత్ర‌కారులు చెబుతారు.

1971 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లు గెలుచుకుని భారీ విజ‌యం సాధించింది. ఇందిరా గాంధీకి అప‌రిమిత అధికారం వ‌చ్చింది. కానీ, ఈ అధికారం దుర్వినియోగానికి దారి తీసింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణలు, ప్ర‌జా హ‌క్కుల హ‌రణ, రాజ‌కీయ వ్య‌తిరేకుల అరెస్టులు మొద‌లైన చ‌ర్య‌లు దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త‌ను పెంచాయి.

కోర్టుల తీర్పు, ప్రజా ఆందోళనలతో..

1971 ఎన్నికల్లో ఓడిపోయిన రాజ్ నారాయ‌ణ్, ఇందిర‌మ్మ విజ‌యాన్ని చాలెంజ్ చేస్తూ కేసు వేశారు. 1975 జూన్ 21న అల‌హాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్ల‌దని తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ప్రజల్లో గల అశాంతి, కోర్టుల తీర్పులతో ఖంగుతిన్న ఇందిరా గాంధీ, జూన్ 25 సాయంత్రం 6 గంటల తర్వాత ఎమ‌ర్జెన్సీ విధించేందుకు రాష్ట్ర‌ప‌తికి లేఖ పంపించారు. ఫ‌క్రుద్దీన్ అలీ అహ్మద్ వెంట‌నే సంత‌కం చేశారంటూ చరిత్రలో ఉంది.

ఏం జ‌రిగింది?

ఎమ‌ర్జెన్సీ అమ‌లుతో ప్రభుత్వ అధికారాలు అప‌రిమితంగా మారాయి. పత్రికల‌పై నిషేధం, ప్రజా హక్కుల హ‌రణ, రాజకీయ వ్యతిరేకుల అరెస్టులు, ప్రజాస్వామ్య సమావేశాల‌పై ఆంక్షలు కొనసాగాయి. ఇది దేశ చరిత్రలో అత్యంత చీక‌టి అధ్యాయంగా నిలిచింది. మొత్తానికి, ఇది 21 నెల‌లు కొనసాగింది.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

8 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

37 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

1 hour ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago