ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా ప్రచారం జరిగింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనా దేవిని చూసేందుకు పవన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారని ప్రచారం జరిగింది.
ఇక, తన తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి షూటింగ్ ఆపేసి అపోలో ఆస్పత్రికి వచ్చారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో, మెగా అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, ఆ వార్తలు అవాస్తవమని పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని నాగబాబు స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు.
దీంతో, ఆ పుకార్లకు చెక్ పడ్డట్లయింది. గతంలో కూడా పవన్ కల్యాణ్ అనారోగ్య కారణాల వల్ల రెండు సార్లు కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే పవన్ హైదరాబాద్ వెళ్లారన్న వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా నాగబాబు తాజా ప్రకటనతో మెగా అభిమానులు, జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on June 25, 2025 7:32 am
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…