ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా ప్రచారం జరిగింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనా దేవిని చూసేందుకు పవన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారని ప్రచారం జరిగింది.
ఇక, తన తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి షూటింగ్ ఆపేసి అపోలో ఆస్పత్రికి వచ్చారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో, మెగా అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, ఆ వార్తలు అవాస్తవమని పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని నాగబాబు స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు.
దీంతో, ఆ పుకార్లకు చెక్ పడ్డట్లయింది. గతంలో కూడా పవన్ కల్యాణ్ అనారోగ్య కారణాల వల్ల రెండు సార్లు కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే పవన్ హైదరాబాద్ వెళ్లారన్న వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా నాగబాబు తాజా ప్రకటనతో మెగా అభిమానులు, జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on June 25, 2025 7:32 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…