Political News

నా భార్య ఫోన్ నూ ట్యాప్ చేశారు: ఈటల

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, మాల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఫోన్ తో పాటు తన సతీమణి జమున ఫోన్ కూడా బీఆర్ఎస్ సర్కారు ట్యాపింగ్ చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య ఫోన్ నే కాకుండా… తన భార్య నడుపుతున్న జమున హ్యాచరీస్ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట సోమవారం హాజరైన ఈటల సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానాలు చెప్పడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వల్ల తాను ఎంతగా మనోవేదనకు గురయ్యానన్న విషయాన్ని కూడా ఆయన సిట్ అధికారులకు తెలియజేశారు. ఈ కేసును ఇంకా నాన్చకుండా త్వరగా తేల్చాలని, నిందితులను శిక్షించాలని ఆయన కోరారు.

సిట్ విచారణ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడిన ఈటల నాటి కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం విపక్షాలకు చెందిన నేతల ఫోన్లను ట్యాప్ చేయాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్ సర్కారుకే వచ్చిందని ఎద్దేవా చేశారు. 2023 ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాప్ చేసిన కేసీఆర్ సర్కారు తాము ఎక్కడ తింటున్నాం… ఎక్కడ పండుకుంటున్నాం.. ఎక్కడ తిరుగుతున్నాం… అన్న అన్ని వివరాలను సేకరించిందని ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రావుకు కన్ ఫర్డ్ ఐపీఎస్ ఇవ్వంగానే… కేసీఆర్ ఏది చెబితే… చట్టం, న్యాయం అన్న విషయాలను పక్కనపెట్టి…అన్నీ చేసుకుంటూ పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on June 24, 2025 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

30 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

6 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago