Political News

జ‌గ‌న్‌ పై అభిమానం.. త‌ల్లిదండ్రులకు శాపమా?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తల్లులకు ఎనలేని ప్రేమ ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతారు. దీనికి కారణం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో 15 వేల రూపాయలు చొప్పున ఏటా పిల్లల చదువులకు వెచ్చించింది. ఆ నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోనే వేసింది. అంతేకాదు విద్యా దీవెన పేరుతో ఉన్నత స్థాయి చదువులు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా తల్లుల ఖాతాల్లోనే వేసింది.

తద్వారా తల్లులను వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సహజంగా ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని అమలు చేస్తే తద్వారా లబ్ధిని ఆశించడం తప్పు కాదు. జగన్ చేసింది కూడా. అదే అమ్మబడి ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక నగదు బదిలీ పథకాల ద్వారా అమ్మల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. అందుకే వైసిపి నాయకుల నుంచి అధినేత జగన్ వరకు అమ్మలంతా మాతోనే ఉన్నారని చెప్పుకునేవారు. ఇప్పటికీ చెబుతున్నారు కూడా. నిజానికి రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున నగదు బదిలీ పథకాలు అమలు చేయడం అనేది జగన్ హయాంలోనే జరిగింది.

ఇది ఎవరు కాదన లేని వాస్తవం. దీంతోనే తల్లులకు సంబంధించిన సానుభూతి క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని వైసిపి నాయకులు అంచనా వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. తల్లులందరూ వైసిపి ఓ పట్ల ఉన్నారనే అనుకుందాం. కానీ, ఇప్పుడు అదే తల్లులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా జగన్ కారణంగా తమ పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారని విచ్చలవిడిగా చేస్తున్న కార్యక్రమాలతో పోలీసులతో దెబ్బలు తింటున్నారని త‌ల్లులు వాపోతున్నారు.

జగన్ అంటే క్రేజీ ఉండొచ్చు. జగన్ అంటే అభిమానం ఉండొచ్చు. అయితే జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొడుతున్న విధానాలు ఆయన దూకుడు స్వభావం కారణంగా యువత పక్కదారి పడుతున్న విషయం గడిచిన నెల రోజులుగా కనిపిస్తూనే ఉంది. పొదిలి ప్రాంతంలో జగన్ పర్యటించినప్పుడు అనేక మంది యువత రోడ్లమీదకు వచ్చి రాళ్లు చెప్పులతో మహిళలపై దాడులు చేశారు. మీరంతా జగన్ చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయారనేది వారి తల్లిదండ్రులే చెబుతున్న మాట. అయితే రాళ్లు చెప్పులు విసిరిన వారిపై పోలీసులు తీవ్ర నేరాల కింద కేసులు పెట్టారు.

పదుల సంఖ్యలో యువతను అరెస్టు చేశారు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో వారిపై లాఠీ చార్జి కూడా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం కారణంగా పోలీసులు తమ పిల్లలను కొడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

ఇక తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటించిన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు కారణంగా యువత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే సినిమా డైలాగులను ప్లకార్డులపై రాసి ప్రదర్శించటం తొడలు కొట్టడం జబ్బలు చర్చడం ప్రభుత్వం పై విమర్శలు గుప్పించటం వంటివి చేశారు. రోడ్లపై నానా నానా బీభత్సం సృష్టించారు. అంతేకాదు ప్రభుత్వానికి సవాళ్లు కూడా రువ్వారు. ఈ విషయాలన్నీ రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు పదుల సంఖ్యలో యువతను అదుపులోకి తీసుకుని స్టేషనులకు తరలించి రోజుల తరబడి వేధించారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వీటంతటికీ కారణం జగన్ అని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన కట్టలు తెగుతోంది. జగన్ కారణంగా తమ పిల్లలు రోడ్డున పడుతున్నారని పోలీసులతో దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తమ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పోలీస్ కేసులు పెడితే రేపు ఉద్యోగాలు రావని జీవితాలు నాశనం అవుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. పైకి ఎవరూ చెప్పుకోలేకపోయినా అంతర్గతంగా కుమిలిపోతున్నారు. గ్రామాల్లోను పట్టణాల్లోనూ ఇద్దరు కలిసిన యువతను జగన్ నాశ‌నం చేస్తున్నాడ‌నే మాట స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో తల్లులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. మరి జగన్ ఇప్పటికైనా తెలుసుకొని తల్లుల సానుభూతి పోతుందన్న విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.

This post was last modified on June 21, 2025 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

23 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

32 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago