గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న జలాల ఆధారంగా ఏపీ నిర్మించతలపెట్టిన బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత, సాగునీటి శాఖ మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. బానకచర్ల విషయంలో అయినా, ఇంకే ప్రాజెక్టు విషయంలో అయినా పొరుగు రాష్ట్రాలతో గొడవలు అవసరం లేదని, సామరస్యపూర్వకంగానే పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో తానే ఓ అడుగు ముందుకేసీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతానన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ ఘాటుగా స్పందించారు.
అయినా బీఆర్ఎస్ మీదా, నాటి సీఎం కేసీఆర్ మీదా రేవంత్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. గోదావరి నుంచి సముద్రంలో కలిసే 3 వేల టీఎంసీల్లోనూ తెలంగాణ వాటాగా 1,950 టీఎంసీలను ఇవ్వాలని కేసీఆర్ నాడే అడిగారని ఆయన చెప్పారు. అంతేకాకుండా సాధారణంగా గోదావరిలో లభించే 968 టీఎంసీలతో కలుపుకుని మొత్తంగా 2,918 టీఎంసీల వాటాను నాడు కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. అయతే ఇప్పుడు రేవంత్ మాత్రం గోదావరిలో కేవలం 1,000 టీఎంసీలు ఇస్తే చాలునని, బానకచర్లకు తాము ఎలాంటి అబ్యంతరం చెప్పబోమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబుతో చర్చలు జరుపుతామన్న రేవంత్ వ్యాఖ్యలతోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర బయట పడిపోయిందని కూడా హరీశ్ రావు ఆరోపించారు. ముందుగానే చంద్రబాబుతో చర్చలు జరిపిన తర్వాతే రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్టాడుతున్నారని బావించాల్సి వస్తోందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని కూడా ఆయన ఆరోపించారు. కేబినెట్ భేటీ, ఆ తర్వాత చంద్రబాబుకు చర్చల కోసం ఆహ్వానం ముందుగా కుర్చుకున్న ఫిక్సింగ్ లో భాగమేనని హరీశ్ ఆరోపించారు.
This post was last modified on June 20, 2025 10:45 pm
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…