తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళుతున్న వైనంపై విపక్షాలు.. ప్రత్యేకించి బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ విమర్శలపై పలుమార్లు తనదైన శైలి సమాధానం ఇచ్చిన రేవంత్ తాజాగా బుధవారం నాటి అఖిలపక్ష సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన ఢిల్లీ టూర్లపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ కు ఆయన దిమ్మితిరిగే రితిలో అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులు కేంద్రం కాకుంటే… ఎర్రవలి ఫామ్ హౌస్ లో కూర్చున్న మీరు ఇస్తారా? అంటూ ఆయన సెటైర్లు సంధించారు.
తెలంగాణ ఆవిర్భవించాక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్… ధనిక రాష్ట్రాన్ని కాస్తా అప్పుల రాష్ట్రంగా మార్చారని రేవంత్ ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్ చేసిన అప్పులన్నీ 11 శాతానికి చేసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అనుమతులు లేక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చిన్నచిన్న రోడ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు కావాలంటే… ఎక్కడికెళ్లాలని ఆయన ప్రశ్నించారు. మెట్రో మలి దశ పనులకు నిధులు, అనుమతుల కోసం ఎక్కడికి వెళ్లాలని రేవంత్ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.
బీఆర్ఎస్ చేసిన అప్పుల వడ్డీలను 7 శాతానికి తగ్గించుకునే యత్నం చేస్తున్నామన్న రేవంత్.,..అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తున్నామన్నారు. ఇక నిలిచిన రోడ్లను పూర్తి చేసేందుకు అటవీ అనుమతుల కోసం సంబంధింత శాఖ మంత్రిని కలుస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, నిధుల విషయంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిని కలవకుండానే పనులు అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇక మెట్రో విస్తరణకు డిల్లీలో ప్రదానిని కలవకుంటే అనుమతులు వస్తాయా? అని రేవంత్ ఫైరయ్యారు.
చివరాఖరుగా… తాను ఢిల్లీ వెళుతుంటే బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉంటే… ఈ పనులన్నింటినీ సాధించేందుకు తాను ఎక్కడికి వెళ్లాలో ఆ పార్టీ నేతలే చెప్పాలని కూడా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న ఎర్రవలి ఫామ్ హౌస్ కు వెళితే…పని అవుతుందంటే… అక్కడికే వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా రేవంత్ ఘాటు వ్యాఖ్య చేశారు. బాగానే వెనకేసుకున్నారు కదా… అందులో నుంచి ఓ రూ.50 వేల కోట్లు పెడితే… సరిపోతుంది కదా అని ఆయన అన్నారు. ఎర్రవలి ఫామ్ హౌస్ వద్ద పని అవుతుందంటే… తనతో పాటు తన కేబినెట్ కూడా కుర్చీలు వేసుకుని వంతుల వారీగా అక్కడే కూర్చుంటామని రేవంత్ సెటైర్లు సంధించారు.
This post was last modified on June 19, 2025 11:32 am
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…