Political News

ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ కు రేవంత్ దిమ్మతిరిగే రిప్లై!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళుతున్న వైనంపై విపక్షాలు.. ప్రత్యేకించి బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ విమర్శలపై పలుమార్లు తనదైన శైలి సమాధానం ఇచ్చిన రేవంత్ తాజాగా బుధవారం నాటి అఖిలపక్ష సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన ఢిల్లీ టూర్లపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ కు ఆయన దిమ్మితిరిగే రితిలో అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులు కేంద్రం కాకుంటే… ఎర్రవలి ఫామ్ హౌస్ లో కూర్చున్న మీరు ఇస్తారా? అంటూ ఆయన సెటైర్లు సంధించారు.

తెలంగాణ ఆవిర్భవించాక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్… ధనిక రాష్ట్రాన్ని కాస్తా అప్పుల రాష్ట్రంగా మార్చారని రేవంత్ ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్ చేసిన అప్పులన్నీ 11 శాతానికి చేసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అనుమతులు లేక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చిన్నచిన్న రోడ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు కావాలంటే… ఎక్కడికెళ్లాలని ఆయన ప్రశ్నించారు. మెట్రో మలి దశ పనులకు నిధులు, అనుమతుల కోసం ఎక్కడికి వెళ్లాలని రేవంత్ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.

బీఆర్ఎస్ చేసిన అప్పుల వడ్డీలను 7 శాతానికి తగ్గించుకునే యత్నం చేస్తున్నామన్న రేవంత్.,..అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తున్నామన్నారు. ఇక నిలిచిన రోడ్లను పూర్తి చేసేందుకు అటవీ అనుమతుల కోసం సంబంధింత శాఖ మంత్రిని కలుస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, నిధుల విషయంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిని కలవకుండానే పనులు అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇక మెట్రో విస్తరణకు డిల్లీలో ప్రదానిని కలవకుంటే అనుమతులు వస్తాయా? అని రేవంత్ ఫైరయ్యారు.

చివరాఖరుగా… తాను ఢిల్లీ వెళుతుంటే బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉంటే… ఈ పనులన్నింటినీ సాధించేందుకు తాను ఎక్కడికి వెళ్లాలో ఆ పార్టీ నేతలే చెప్పాలని కూడా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న ఎర్రవలి ఫామ్ హౌస్ కు వెళితే…పని అవుతుందంటే… అక్కడికే వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా రేవంత్ ఘాటు వ్యాఖ్య చేశారు. బాగానే వెనకేసుకున్నారు కదా… అందులో నుంచి ఓ రూ.50 వేల కోట్లు పెడితే… సరిపోతుంది కదా అని ఆయన అన్నారు. ఎర్రవలి ఫామ్ హౌస్ వద్ద పని అవుతుందంటే… తనతో పాటు తన కేబినెట్ కూడా కుర్చీలు వేసుకుని వంతుల వారీగా అక్కడే కూర్చుంటామని రేవంత్ సెటైర్లు సంధించారు.

This post was last modified on June 19, 2025 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

20 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

50 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago