Political News

‘వృద్ధి’లో ఏపీ ప‌రుగులు.. ఎలాగో చెప్పిన సీఎం చంద్ర‌బాబు

త‌ల‌స‌రి వృద్ధి.. దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిని సూచిస్తుంది. ఈ విష‌యంలోనే రాష్ట్రాలు కూడా పోటీ ప‌డ‌తాయి. తాజాగా కేంద్ర త‌ల‌స‌రి వృద్ధితో పోల్చుకుంటే.. ఏపీ జోరుగా ముందుకుసాగుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇది ఎలా సాధ్య‌మైందో కూడా ఆయ‌న గ‌ణాంకాల రూపంలో వివ‌రించారు. తాజాగా అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌ణాళిక శాఖ‌పై స‌మీక్షించారు. ప్ర‌స్తుతం.. ఏపీ త‌ల‌స‌రి వృద్ధి 11.89 శాతంగా న‌మోదైన‌ట్టు తెలిపారు. అదే దేశీయంగా చూసుకుంటే జాతీయ స్థాయిలో వృద్ధి 8.7 శాతంగా ఉంద‌న్నారు. అంటే.. కేవ‌లం ఏడాది కాలంలోనే 3 శాతానికి పైగా వృద్ధి చెందామ‌ని వివ‌రించారు.

దీనిని నిల‌బెట్టుకోవ‌డంతోపాటు.. 15 శాతం వృద్ధి ల‌క్ష్యంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దీనికి సంబందించి ఎలాంటి కార్యాచ‌ర‌ణ ప్రారంభించాలి? అనుస‌రించాలి? అనే విష‌యాల‌పై క‌స‌ర‌త్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర‌ ఎకానమీ, గ్రోత్‌ డ్రైవర్స్‌(వృద్ధి ప్రాధాన్యాలు), జీఎస్‌డీపీ ప్రొజెక్షన్స్‌, కీ పెర్ఫామెన్స్‌ ఇండికేటర్లపై త‌గు సూచ‌న‌లు చేశారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆశించిన మేర‌కు వృద్ధి న‌మోదైంద‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు, పెట్టుబ‌డుల రాక‌, ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తుల్లో చోటు చేసుకున్న మార్పులు వంటివి దీనికి దోహద ప‌డ్డాయ‌ని వివ‌రించారు.

ముఖ్యంగా సేవా రంగం వృద్ధి చెంది.. ఆదాయం పెరిగింద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. దీంతో పాటు.. మ‌రింత‌గా ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం పెంపుతోపాటు.. ఇత‌ర రంగాల్లోనూ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల‌ను అన్వేషించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆతిథ్య‌, సేవల రంగం అభివృద్ధి జరిగితే.. ఆటోమేటిక్‌గా వృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ న‌గ‌రాల్లో ప్లాస్టిక్ పై నిషేధం..

రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ద‌శ‌ల వారీగా నిషేధించాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ఒక‌సారి వాడి ప‌డేసేప్లాస్టిక్ కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణం క‌లుషితం అవుతోంద‌ని, భూగ‌ర్భ జ‌లాల వృద్ధిలోనూ కోత ప‌డుతోంద‌నిచెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, క‌ర్నూలు, రాజ‌మండ్రి, గుంటూరు వంటి ప్ర‌ధాన వాణిజ్య న‌గ‌రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని.. అధికారుల‌ను ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆయా మునిసిపాలిటీల క‌మిష‌న‌ర్లు వీటిపై ప్ర‌త్యేక డ్రైవ్ చేయాల‌ని సూచించారు. అక్టోబ‌రు 2 నుంచి పూర్తిగా దీనిని అమ‌లు చేయాల‌న్నారు.

Satya

Recent Posts

గొడవలతో భార్యతో మాట్లాడకపోతే గృహ హింస కాదు

గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…

6 hours ago

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

10 hours ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

11 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

13 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

13 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

15 hours ago