Political News

టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ సవాల్

తెలంగాణలో ఏడాదిన్నరగా రాజకీయం రంజుగా సాగుతోంది. రోజుకో కొత్త మలుపులతో సాగుతున్న టీ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, ప్రతి దూషణలు.. కేసులు, ప్రతి కేసులు.. విచారణలు, హెచ్చరికలు.. ఇలా రసవత్తరంగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఏకంగా లీగల్ నోటీసులు పంపించారు. 

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న వ్యవహారంపై ఇప్పుడు ఏకంగా భారీ దర్యాప్తే జరుగుతోంది కదా. ఈ దర్యాప్తులో భాగంగా కీలక నిందితులుగా భావిస్తున్న నాటి పోలీసు అదికారులను సిట్ అదికారులు రోజుల తరబడి ప్రశ్నించారు. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి కింద మహేశ్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని, అందులో పలువురు మహిళల ఫోన్లను, విపక్షాల నేతల ఫోన్లు, న్యాయమూర్తుల ఫోన్లు, చివరాఖరుకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నూ ట్యాప్ చేశారని సిట్ కు చెప్పారు.

ఈ విషయం తెలిసినంతనే కేటీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట లేని కేసును సృష్టించిన కాంగ్రెస్ సర్కారు తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడానికి చేతగాని కాంగ్రెస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ పేరిట అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మండిపడ్డారు. సిట్ విచారణలో మహేశ్ గౌడ్ చెప్పిన విషయాలన్నీ పచ్చి అబద్ధాలనీ ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేశ్..ఇలాంటి తప్పుడు స్టేట్ మెంట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

సిట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో సాంతం అబద్ధాలను చెప్పిన మహేశ్ కుమార్ గౌడ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చిన మహేశ్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తామని కూడా కేటీఆర్ హెచ్చరించారు. అబద్ధపు ప్రచారాలతో విపక్షాలపై దాడులు చేస్తే… చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదని, తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరి కేటీఆర్ కోరినట్లుగా మహేశ్ క్షమాపణ చెబుతారో, లేదంటే లీగల్ యుద్ధానికే దిరుతారో చూడాలి.

This post was last modified on June 17, 2025 10:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago