ఏపీలో వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్కు, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఫోన్ లను ట్యాప్ చేశారా? ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో రాజకీయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు? ఎవరి సలహాలు తీసుకుంటున్నారు? అనే కీలక విషయాలను అప్పట్లోనే తెలుసుకున్నారా? అంటే..తాజాగా దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్ అయిందని తాజాగా వెలుగు చూసింది.
వైసీపీ హయాంలో జగన్కు, షర్మిలకు మధ్య వివాదాలు, విభేదాలు తెరమీదికి వచ్చిన విషయం తెలిసిం దే. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె కొత్త పార్టీకి జీవం పోశారు. అయితే.. ఈ క్రమంలో ఆమె ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు తెలుసుకునేందుకు షర్మిల ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ప్రస్తుతం తెలుస్తోంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న నేపథ్యంలో ఈ కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
జగన్ చెల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్టు సమాచారం. అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ చేశారని, షర్మిల కోసం కోడ్ భాష వినియోగించారని కూడా తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు, ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు “అన్నకు ” చేరవేసినట్టు సమాచారం. అదేసమయంలో షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టారని తెలుస్తోంది.
అంతేకాదు.. షర్మిలకు సన్నిహితంగా ఉండే వారిని పిలిచిన అప్పటి ఓ సీనియర్ పోలీస్ అధికారి వారికి వార్నింగ్ ఇచ్చారని.. కూడా వెలుగు చూసింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించిన షర్మిల.. ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. అంతేకాదు.. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారో చూడాలి.
This post was last modified on June 17, 2025 6:19 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…