“ఆయన బతికుంటే.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు!”- అని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవారు ఉంటే.. చిరంజీవి, పవన్ కల్యాణ్లు అసలు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదని.. వారు తమ సినిమాలు చేసుకునేవారని చెప్పారు. అలా సేవ చేసే వారు లేకపోబట్టే.. వారు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో కాపు ఉద్యమ నాయకుడు, దివంగత వంగవీటి మోహన్రంగా పేరు ప్రస్తావనకు వచ్చిం ది. రంగాపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించినప్పుడు.. ఆయన గొప్ప నాయకుడని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు కాబట్టే.. ఆయన చనిపోయిన ఇన్నేళ్లయినా.. ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారని తెలిపారు. నిజానికి ఆయన జీవించి ఉంటే.. మేం రాజకీయాల్లోకి వచ్చేవాళ్లం కాదని చెప్పుకొచ్చారు.
“రంగా జీవించి ఉంటే.. మేం రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఏముంటుంది? ఓ గొప్ప వ్యక్తి, పదిమందికి సాయం చేసే గొప్ప నాయకుడు ఉండుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కేవారు కాదు.” అని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సొంత పార్టీలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదన్నారు. తాము హాయిగా సినిమాలు చేసుకునే వాళ్లమని ఆయన చెప్పారు. రంగా జీవించి ఉంటే.. ఏపీకి ఆయనే సీఎం అయ్యేవారని తెలిపారు.
This post was last modified on June 17, 2025 6:13 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…