“ఆయన బతికుంటే.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు!”- అని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవారు ఉంటే.. చిరంజీవి, పవన్ కల్యాణ్లు అసలు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదని.. వారు తమ సినిమాలు చేసుకునేవారని చెప్పారు. అలా సేవ చేసే వారు లేకపోబట్టే.. వారు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో కాపు ఉద్యమ నాయకుడు, దివంగత వంగవీటి మోహన్రంగా పేరు ప్రస్తావనకు వచ్చిం ది. రంగాపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించినప్పుడు.. ఆయన గొప్ప నాయకుడని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు కాబట్టే.. ఆయన చనిపోయిన ఇన్నేళ్లయినా.. ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారని తెలిపారు. నిజానికి ఆయన జీవించి ఉంటే.. మేం రాజకీయాల్లోకి వచ్చేవాళ్లం కాదని చెప్పుకొచ్చారు.
“రంగా జీవించి ఉంటే.. మేం రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఏముంటుంది? ఓ గొప్ప వ్యక్తి, పదిమందికి సాయం చేసే గొప్ప నాయకుడు ఉండుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కేవారు కాదు.” అని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సొంత పార్టీలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదన్నారు. తాము హాయిగా సినిమాలు చేసుకునే వాళ్లమని ఆయన చెప్పారు. రంగా జీవించి ఉంటే.. ఏపీకి ఆయనే సీఎం అయ్యేవారని తెలిపారు.
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…