Political News

లిక్కర్ కేసులో కొత్త, వింత కథ!

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంలో మంగళవారం అనూహ్యంగా ఓ కొత్త స్టోరీ వినిపించింది. ఈ స్టోరీ కొత్తదిగానే కాకుండా వింతగానూ ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా జారీ కాని వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత కొంత కాలంగా తనను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణల్లో బాగంగానే ఆయనకు పదేళ్ల పాటు గన్ మన్ గా వ్యవహరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఈ వింత కథను వినిపించారు.

ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మదన్ రెడ్డి..చెవిరెడ్డికి పదేళ్లకు పైగా గన్ మన్ గా పనిచేశారట. ఇప్పుడు మదన్ రెడ్డిని మద్యం సిట్ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనను బలవంతం చేశారని, తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఏకంగా దాడి కూడా చేశారని మదన్ రెడ్డి ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఆ పిటిషన్ లోని అంశాలతో కూడిన లేఖను ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఢిజీపీ గుప్తాలకు పంపారు.

ఈ లేఖలో మదన్ రెడ్డి ఏమంటారంటే… మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్రను నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు మదన్ రెడ్డిని విచారణకు పిలిచారు. ఈ విచారణకు మదన్ రెడ్డి యూనీఫాంలో వెళ్లినందుకు ఆయనను సిట్ అధికారులు తిట్టారట. ఇక మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి పాత్ర ఉందని చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చారట. మదన్ కంటే ముందు విచారణకు హాజరైన మరో ఏఆర్ కానిస్టేబుల్ తాము చెప్పినట్టే విన్నారని వారు మదన్ కు చెప్పారట. అయితే తప్పుడు స్టేట్ మెంట్ ను తాను ఇవ్వలేనని మదన్ చెప్పగా… సిట్ కు చెందిన 10 అధికారులు ఆయనపై మూకుమ్మడి దాడి చేశారట. ఈ దాడిలో ఆయన గాయపడ్డారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇకపై విచారణకు తాను ఒంటరిగా వెళ్లలేనని, లాయర్ ను అనుమతిస్తేనే వెళతానని, ఆ దిశగా ఉత్తర్వులు ఇవ్వాలని మదన్ కోర్టును కోరారు.

అయినా కోర్టులో ఎంతో ప్రభావవంతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఓ కానిస్టేబుల్ ను ఆయన సొంత శాఖ అధికారులు ఒత్తిడి చేయడం, దాడి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే సామాన్యుడు సైతం ఇప్పుడు న్యాయం కోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు గడప తొక్కుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను విచారణకు పిలిచి ఒత్తిడి చేసి, దాడి చేసి తమకు ఇష్టమొచ్చినట్లుగా స్టేట్ మెంట్ రికార్డు చేసే సాహసం పోలీసు అధికారులు చేస్తారా? అంటే… నిస్సందేహంగా లేదనే సమాధానమే వస్తోంది. మరి ఈ కొత్త, వింత కథ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 17, 2025 1:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

24 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

1 hour ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

4 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

5 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

5 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

6 hours ago