Political News

లిక్కర్ కేసులో కొత్త, వింత కథ!

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంలో మంగళవారం అనూహ్యంగా ఓ కొత్త స్టోరీ వినిపించింది. ఈ స్టోరీ కొత్తదిగానే కాకుండా వింతగానూ ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా జారీ కాని వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత కొంత కాలంగా తనను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణల్లో బాగంగానే ఆయనకు పదేళ్ల పాటు గన్ మన్ గా వ్యవహరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఈ వింత కథను వినిపించారు.

ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మదన్ రెడ్డి..చెవిరెడ్డికి పదేళ్లకు పైగా గన్ మన్ గా పనిచేశారట. ఇప్పుడు మదన్ రెడ్డిని మద్యం సిట్ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనను బలవంతం చేశారని, తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఏకంగా దాడి కూడా చేశారని మదన్ రెడ్డి ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఆ పిటిషన్ లోని అంశాలతో కూడిన లేఖను ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఢిజీపీ గుప్తాలకు పంపారు.

ఈ లేఖలో మదన్ రెడ్డి ఏమంటారంటే… మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్రను నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు మదన్ రెడ్డిని విచారణకు పిలిచారు. ఈ విచారణకు మదన్ రెడ్డి యూనీఫాంలో వెళ్లినందుకు ఆయనను సిట్ అధికారులు తిట్టారట. ఇక మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి పాత్ర ఉందని చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చారట. మదన్ కంటే ముందు విచారణకు హాజరైన మరో ఏఆర్ కానిస్టేబుల్ తాము చెప్పినట్టే విన్నారని వారు మదన్ కు చెప్పారట. అయితే తప్పుడు స్టేట్ మెంట్ ను తాను ఇవ్వలేనని మదన్ చెప్పగా… సిట్ కు చెందిన 10 అధికారులు ఆయనపై మూకుమ్మడి దాడి చేశారట. ఈ దాడిలో ఆయన గాయపడ్డారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇకపై విచారణకు తాను ఒంటరిగా వెళ్లలేనని, లాయర్ ను అనుమతిస్తేనే వెళతానని, ఆ దిశగా ఉత్తర్వులు ఇవ్వాలని మదన్ కోర్టును కోరారు.

అయినా కోర్టులో ఎంతో ప్రభావవంతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఓ కానిస్టేబుల్ ను ఆయన సొంత శాఖ అధికారులు ఒత్తిడి చేయడం, దాడి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే సామాన్యుడు సైతం ఇప్పుడు న్యాయం కోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు గడప తొక్కుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను విచారణకు పిలిచి ఒత్తిడి చేసి, దాడి చేసి తమకు ఇష్టమొచ్చినట్లుగా స్టేట్ మెంట్ రికార్డు చేసే సాహసం పోలీసు అధికారులు చేస్తారా? అంటే… నిస్సందేహంగా లేదనే సమాధానమే వస్తోంది. మరి ఈ కొత్త, వింత కథ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 17, 2025 1:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

20 minutes ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

26 minutes ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

50 minutes ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

1 hour ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

2 hours ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

3 hours ago