ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన మూలపాడు గ్రామానికి మహర్దశ పట్టనుందా? ఈ గ్రామం అమరావతికి ‘ఓపెన్ వే'(ముఖ ద్వారం) కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అమరావతి కోసం రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా ఇప్పటికే సమీకరించారు. దీనిలో అమరావతి ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు మూలపాడువైపు అధికారులు, ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతోంది.
దీంతో రాజధాని ముఖద్వారాన్ని మూలపాడు గ్రామం దగ్గర ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. అంటే.. ఈ ప్రాంతంలోనే రాజధానికి సంబంధించిన కీలకమైన ‘ఐకానిక్ బ్రిడ్జి’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూల పాడు గ్రామానికి చేరువలో ఉన్న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో భూసార పరీక్షలు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన వెంటనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతున్నాయి.
మూలపాడు గ్రామంలో రాజధాని ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసేలా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే సీఎం సహా సీఆర్ డీఏ అధికారులకు వివరాలు అందించారు. అంటే.. అమరావతికి వెళ్లాలని అనుకునేవారు.. మూలపాడులో ఏర్పాటు చేసే ముఖ ద్వారం గుండానే ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే.. ఇది హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వచ్చే వారికి అందుబాటులో ఉంటుంది.
ఇక, గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి.. ఉండవల్లి నుంచి ఇప్పటికే కరకట్ట దారిని ఏర్పాటు చేశారు. దీనిని ఆరు లేన్ల రహదారిని చేయనున్నారు. ఏదేమైనా మూలపాడుకు మహర్దశ పట్టనుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఇది అమరావతికి గేమ్ ఛేంజర్గా మారుతుందని అంటున్నారు.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…