Political News

బాబు వాడే హెలికాప్టర్ పై ఇంత నిర్లక్ష్యమా..?

ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల పర్యటనల్లో బాబు ఈ హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తారు. అయితే ఈ హెలికాప్టర్ భద్రతపై మాత్రం అధికారులు అంతగా దృష్టి సారించడం లేదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పుడప్పుడూ సాంకేతిక కారణాలు సహజమే గానీ.. మరీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం ఆదివారం నాటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా వెలుగు చూసింది.

ఏపీలో పొగాకు రైతుల సమస్య, ఇతర వాణిజ్య పంటల ఎగుమతులు, ఇతర పంటలకు మద్దతు ధరల విషయాల్లో పరిష్కార మార్గాలను చూపేందుకు గోయల్ ఆదివారం ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతిలో చంద్రబాబుతో లంచ్ మీటింగ్ లో పాలుపంచుకున్న గోయల్… ఆ తర్వాత బాబు జిల్లాల పర్యటనలకు వాడే హెలికాప్టర్ లోనే తిరుపతి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం అదే హెలికాప్టర్ లో గోయల్ కృష్ణపట్నం వెళదామని ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా కృష్ణపట్నం టూర్ ను రద్దు చేసుకున్న గోయల్… నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు.

బాబు జిల్లాల టూర్ లకు వినియోగించే ఈ హెలికాప్టర్ నే ఏపీకి వచ్చే వీవీఐపీల పర్యటనకూ దీనినే వినియోగిస్తున్నారు. అయితే చాలా కాలంగా ఈ హెలికాప్టర్ లో ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయిట. అయితే వీటిని అధికారులు అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఇలాంటి విషయాలపై బాబు పెద్దగా పట్టించుకోరు కాబట్టి…ఈ విషయాన్ని అధికారులూ సీరియస్ గా తీసుకోనట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి టూర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ విషయం నేరుగా డీజీపీ దృష్టికి చేరిపోయింది.

సాక్షాత్తు సీఎం చంద్రబాబు వినియోగించే హెలికాప్టర్ లో ఇలా సమస్యలు తలెత్తితే వాటి గురించి ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన అవసరం లేదా? అని డీజీపీ కిందిస్థాయి అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే… ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం. అంతటితో ఆగని డీజీపీ… సీఎం వినియోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక చూసిన తర్వాత ఈ హెలికాప్టర్ ను వాడాలా? పక్కనపెట్టేయాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

This post was last modified on June 16, 2025 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago