Political News

బాబు వాడే హెలికాప్టర్ పై ఇంత నిర్లక్ష్యమా..?

ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల పర్యటనల్లో బాబు ఈ హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తారు. అయితే ఈ హెలికాప్టర్ భద్రతపై మాత్రం అధికారులు అంతగా దృష్టి సారించడం లేదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పుడప్పుడూ సాంకేతిక కారణాలు సహజమే గానీ.. మరీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం ఆదివారం నాటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా వెలుగు చూసింది.

ఏపీలో పొగాకు రైతుల సమస్య, ఇతర వాణిజ్య పంటల ఎగుమతులు, ఇతర పంటలకు మద్దతు ధరల విషయాల్లో పరిష్కార మార్గాలను చూపేందుకు గోయల్ ఆదివారం ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతిలో చంద్రబాబుతో లంచ్ మీటింగ్ లో పాలుపంచుకున్న గోయల్… ఆ తర్వాత బాబు జిల్లాల పర్యటనలకు వాడే హెలికాప్టర్ లోనే తిరుపతి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం అదే హెలికాప్టర్ లో గోయల్ కృష్ణపట్నం వెళదామని ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా కృష్ణపట్నం టూర్ ను రద్దు చేసుకున్న గోయల్… నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు.

బాబు జిల్లాల టూర్ లకు వినియోగించే ఈ హెలికాప్టర్ నే ఏపీకి వచ్చే వీవీఐపీల పర్యటనకూ దీనినే వినియోగిస్తున్నారు. అయితే చాలా కాలంగా ఈ హెలికాప్టర్ లో ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయిట. అయితే వీటిని అధికారులు అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఇలాంటి విషయాలపై బాబు పెద్దగా పట్టించుకోరు కాబట్టి…ఈ విషయాన్ని అధికారులూ సీరియస్ గా తీసుకోనట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి టూర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ విషయం నేరుగా డీజీపీ దృష్టికి చేరిపోయింది.

సాక్షాత్తు సీఎం చంద్రబాబు వినియోగించే హెలికాప్టర్ లో ఇలా సమస్యలు తలెత్తితే వాటి గురించి ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన అవసరం లేదా? అని డీజీపీ కిందిస్థాయి అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే… ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం. అంతటితో ఆగని డీజీపీ… సీఎం వినియోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక చూసిన తర్వాత ఈ హెలికాప్టర్ ను వాడాలా? పక్కనపెట్టేయాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

This post was last modified on June 16, 2025 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago