Political News

పొంగులేటీపై టీపీసీసీ చీఫ్ గుస్సా.. రీజనేంటి?

వారిద్దరూ తెలంగాణలోని అదికార పార్టీకి చెందిన వారే. ఒకరేమో మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరొకరేమో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వీరి మధ్య ఇప్పటిదాకా పెద్దగా విబేధాలన్న మాటే లేదు. అయితే ఒకే ఒక్క విషయం… పొంగులేటిపై మహేశ్ గౌడ్ అంతెత్తున ఎగిరి పడేలా చేసింది. ఇదేం ఆతృత? చూసుకొని మాట్లాడాలిగా… అంటూ ఆయన మంత్రిగారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొంగులేటిపై మహేశ్ గుస్సాకు కారణమేమిటన్న విషయానికి వస్తే… రేవంత్ రెడ్డి కేబినెట్ లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలతో పాటుగా ఐఅండ్ పీఆర్ శాఖల మంత్రిగా పొంగులేటి కొనసాగుతున్నారు. ఈ శాఖలకు సంబంధించిన అంశాలు తప్పించి ఇతరత్రా అంశాలతో పొంగులేటికి సంబంధం లేదు. నిబంధనల మేరకు పొంగులేటి తన పరిధిలోని శాఖల గురించి మాత్రమే మాట్లాడాలి. అయితే ఆదివారం పాలేరులో నిర్వహించిన ఓ సభలో ఆయన ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగానే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

పొంగులేటి వ్యాఖ్యలతో ఆదివారం మధ్యాహ్నం నుంచే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలకు ఆయా పార్టీలు ఏ మేర సిద్ధంగా ఉన్నాయంటూ దాదాపుగా అన్ని మీడియా సంస్థలు కథనాలు రాసేశాయి. ఇక బీసీ రిజర్వేషన్లను తేల్చకుండా కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందని బీఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది. వాస్తవానికి రిజర్వేషన్ల ఖరారు, రొటేషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు  ఏర్పాట్లు జరుగుతాయి. అయినా స్థానిక సంస్థలైన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లు పంచాయతీరాజ్ శాఖ కిందకు వస్తాయి. ఈ శాఖ సీతక్క ఆధ్వర్యంలో ఉంది. ఇక మునిసిపల్ శాఖ సీఎం రేవంత్ వద్ద ఉంది. వారిద్దరి ప్రమేయం లేకుండానే పొంగులేటి ప్రకటన చేసేశారు.

బీసీ రిజర్వేషన్లను తేల్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహిస్తారన్న అంశం నిజంగానే కాంగ్రెస్ కు సంకట పరిస్థితిని తీసుకొచ్చేదే. మూకుమ్మడిగా విపక్షాలన్నీ ఒకేసారి ఇదే అంశాన్ని భుజానికెత్తుకుంటే.. ఆన్సర్ ఇవ్వడం కాంగ్రెస్ కు కష్టమే. అందుకే కాబోలు… పరిస్థితిని సాంతం సమీక్షించిన మహేశ్ గౌడ్… పొంగులేటి ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలను ముందుగానే ఎలా ప్రస్తావిస్తారని పొంగులేటిని మహేశ్ ప్రశ్నించారు. అంతేకాకుండా మీకు సంబంధం లేని శాఖ విషయాల గురించి మీరెందుకు మాట్లాడటం అని కూడా ఆయన పొంగులేటికి గుర్తు చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న జాగ్రత్తలు పాటించకపోతే ఎలాగని కూడా ఆయన ప్రశ్నించారు. మరి మహేశ్ గుస్సాకు పొంగులేటి ఏ రీతిన ఆన్సర్ ఇస్తారో చూడాలి.

This post was last modified on June 16, 2025 3:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

2 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

3 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

6 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

6 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

7 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

7 hours ago