Political News

జీరో నుంచి మొద‌లు.. వైసీపీ ఏం చేయాలి ..!

ప్ర‌జ‌లు ఓడించి ఏడాది అయింది. మ‌రో 4 సంవ‌త్స‌రాల పాటు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం లేదు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. వైసీపీలో త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌లు. ఎందుకంటే.. ఒక్క ఏడాదిలోనే అనేక అరెస్టులు, అనేక మంది జంపింగుల‌ను పార్టీ చ‌వి చూసింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాలు అంటే.. మ‌రింత క‌ష్టం. దీంతో పార్టీలో నాయ‌కులు ఏం చేయాల‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కానీ.. ఇక్క‌డే కీల‌క విషయాన్ని పార్టీ నాయ‌కులు విస్మ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు. అయితే.. ర‌చ్చ లేక‌పోతే.. సైలెంట్ అన్న‌ట్టుగానే నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక, బ‌ల‌మైన ప్ర‌భుత్వ ప‌క్షం కూడా వైసీపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇది రాజ‌కీయంగా చేసే ప‌నే. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. వైసీపీ దూకుడు విషయంలో మార్పులు చేసుకుని.. జీరో నుంచి మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మార్పుల దిశ‌గానే కాదు.. అస‌లు ఏమీలేదు.. అనుకుని ప్రారంభించాల‌ని అంటున్నారు.

గ్రామీణ స్థాయి నుంచే కాకుండా.. బూత్ లెవిల్ నుంచి కూడా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థులు వేస్తున్న ముద్ర‌ల నుంచి కూడా బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తంది. గ‌తంలోనే సైకో అంటూ.. జ‌గ‌న్‌పై పేరు ప‌డింది. ఆనాడే ఆయ‌న దీనిపై స్పందించి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతాల‌కు చేరిపోయింది. ఇక‌, అరాచ‌క పార్టీ ముద్ర కూడా ఇబ్బంది పెడుతోంది. దీంతో విజ్ఞులు సైతం స్పందించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇలాంటివాటిని స‌ర్దుబాటు చేసుకోవాలి. మేధావి వ‌ర్గాల‌తో కూర్చుని చ‌ర్చ‌ల‌కు దిగాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ ప‌ట్ల పాజిటివిటీని పెంచేలా జ‌గ‌న్ న‌డుం బిగించాలి. ఎక్క‌డో కూర్చుని పార్టీని న‌డిపించే ప‌రిస్థితిని విడ‌నాడాలి. ప్ర‌జ‌ల మ‌ద్యకురావాలి. అలాగ‌ని ర్యాలీలు, రోడ్ షోల‌కు ప‌రిమితం కాకుండా.. స‌భ‌లు, స‌మావేశాల‌కు అవ‌కాశం ఇవ్వాలి.

త‌న హ‌యాంలో ఏం జ‌రిగింది? అనేది ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. చూసి చ‌ద‌వ‌డం అనే సంస్కృతిని విడ‌నాడాలి. ఇలా.. జీరో స్థాయి నుంచి ప్రారంభిస్తే త‌ప్ప‌.. పార్టీ పుంజుకునే అవ‌కాశం మాట ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 14, 2025 4:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైకేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్… రికార్డులు సాధ్యమా?

​వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…

1 hour ago

గోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదే

ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…

2 hours ago

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…

3 hours ago

నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!

నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…

3 hours ago

అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన దురంధర్ 2

ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…

3 hours ago

కపుల్ ఫ్రెండ్లీ లక్ష్యానికి ప్రభాస్ అండ

ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…

4 hours ago