తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం వరుసగా రెండో సారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం వైద్య పరీక్షలు పూర్తి కాలేదో, లేదంటే ఆ పరీక్షల్లో ఏదైనా సీరియస్ ఆరోగ్య సమస్య గుర్తించారో తెలియదు గానీ శనివారం కూడా కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు.
కేసీఆర్ శనివారం నాడు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లే సందర్భంగా ఆయన వెంట కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు ఆసుపత్రికి తరలివెళ్లారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. కేసీఆర్ జనరల్ చెకప్ కోసమే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని, వైద్య పరీక్షల తర్వాత ఆయన తిరిగి ఇంటికి వెళతారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… శుక్రవారం ఐఏజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ కు ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిగాయి. తాజాగా శనివారం కూడా కేసీఆర్ కు జరుగుతున్న వైద్య పరీక్షలు, ఇతరత్రా చికిత్సలను కూడా నాగేశ్వరరెడ్డి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వయసురీత్యా నెలకొన్న అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా కేసీఆర్ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మరి శనివారం నాటి వైద్య పరీక్షల్లో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఏమైనా వివరాలు వెల్లడవుతాయో, లేదో చూడాలి.
This post was last modified on June 14, 2025 2:31 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…