Political News

ఇదేం న్యాయం?.. రామ్మోహన్ నాయుడిపై ట్రోలింగ్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.

రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీలోని విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే… ఉన్నదీ, లేనిదీ అన్న తేడా లేకుండా విషయం ఏది దొరికితే…దానిని తనకు అనుకూలంగా, ఇతరులకు వ్యతిరేకంగా మార్చేసి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడం ఆ పార్టీకి అలవాటే. అందులో భాగంగానే రామ్మోహన్ రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను అలా పక్కన పెడితే… గురువారం సాయంత్రం నుంచే రామ్మోహన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.

ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో విజయవాడలో ఉన్న రామ్మోహన్ హుటాహుటీన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని అదికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడికి వెళ్లిన తొలి మంత్రి రామ్మోహనే. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోకు బీజీఎం జోడిస్తూ… రామ్మోహన్ సిబ్బంది ఓ వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో పెట్టారట. ఈ వీడియోను చూసిన నెటిజన్లు… రామ్మోహన్ అక్కడికి పరిశీలనకు వెళ్లారా? లేదంటే రీల్స్ కోసం వెళ్లారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం నాటికి ఈ ట్రోలింగ్ మరింతగా పెరిగిపోయింది.

చివరకు ప్రజాశాంతి పార్టీ అదినేత, క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కూడా రామ్మోహన్ పై విరుచుకుపడ్డారు. రామ్మోహన్ కు ఏవియేషన్ పై అసలు అవగాహనలే లేదని, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఎక్కడో జరిగిన పొరపాటుకు విమానం అయితే కూలింది. అయితే ఆ తప్పు నేరుగా కేంద్ర మంత్రే చేశారంటూ నిందించడం తగదు కదా. మరి అలాగని దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా… వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసుకుంటూ పోతే ఇక పాలన సాగేదెలా?

Satya

Recent Posts

20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?

భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…

46 minutes ago

మరోసారి హామీల ప్రస్తావన తెచ్చిన సీఎం

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి పాలన చేస్తున్నామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. గత ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ హ‌యాంలో రాష్ట్రం…

1 hour ago

స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీలోని ఆశావ‌హుల‌కు అంద‌రికీ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేన ముఖ్య…

1 hour ago

నిన్న జొన్నగిరి… నేడు రామగిరి

రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ…

1 hour ago

భారతీయ థియేటర్లలో ‘ఒడిస్సీ’ జపం

ఇవాళ ఎక్కడ చూసినా ది ఒడిస్సి తాలూకు ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఈ సినిమా ట్వీట్లతో…

2 hours ago

జూలై 17… ఇంటి వినోదానికి ఢోకా లేదు

కొత్త శుక్రవారం వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర బోలెడు సినిమాలు కనిపిస్తున్నాయి కానీ వెంటనే వెళ్ళిపోదామనిపించేలా ఏదీ లేకపోవడం బయ్యర్ వర్గాలను…

3 hours ago