ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీలోని విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే… ఉన్నదీ, లేనిదీ అన్న తేడా లేకుండా విషయం ఏది దొరికితే…దానిని తనకు అనుకూలంగా, ఇతరులకు వ్యతిరేకంగా మార్చేసి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడం ఆ పార్టీకి అలవాటే. అందులో భాగంగానే రామ్మోహన్ రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను అలా పక్కన పెడితే… గురువారం సాయంత్రం నుంచే రామ్మోహన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.
ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో విజయవాడలో ఉన్న రామ్మోహన్ హుటాహుటీన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని అదికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడికి వెళ్లిన తొలి మంత్రి రామ్మోహనే. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోకు బీజీఎం జోడిస్తూ… రామ్మోహన్ సిబ్బంది ఓ వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో పెట్టారట. ఈ వీడియోను చూసిన నెటిజన్లు… రామ్మోహన్ అక్కడికి పరిశీలనకు వెళ్లారా? లేదంటే రీల్స్ కోసం వెళ్లారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం నాటికి ఈ ట్రోలింగ్ మరింతగా పెరిగిపోయింది.
చివరకు ప్రజాశాంతి పార్టీ అదినేత, క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కూడా రామ్మోహన్ పై విరుచుకుపడ్డారు. రామ్మోహన్ కు ఏవియేషన్ పై అసలు అవగాహనలే లేదని, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఎక్కడో జరిగిన పొరపాటుకు విమానం అయితే కూలింది. అయితే ఆ తప్పు నేరుగా కేంద్ర మంత్రే చేశారంటూ నిందించడం తగదు కదా. మరి అలాగని దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా… వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసుకుంటూ పోతే ఇక పాలన సాగేదెలా?
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…