Political News

ఇదేం న్యాయం?.. రామ్మోహన్ నాయుడిపై ట్రోలింగ్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.

రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీలోని విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే… ఉన్నదీ, లేనిదీ అన్న తేడా లేకుండా విషయం ఏది దొరికితే…దానిని తనకు అనుకూలంగా, ఇతరులకు వ్యతిరేకంగా మార్చేసి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడం ఆ పార్టీకి అలవాటే. అందులో భాగంగానే రామ్మోహన్ రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను అలా పక్కన పెడితే… గురువారం సాయంత్రం నుంచే రామ్మోహన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.

ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో విజయవాడలో ఉన్న రామ్మోహన్ హుటాహుటీన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని అదికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడికి వెళ్లిన తొలి మంత్రి రామ్మోహనే. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోకు బీజీఎం జోడిస్తూ… రామ్మోహన్ సిబ్బంది ఓ వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో పెట్టారట. ఈ వీడియోను చూసిన నెటిజన్లు… రామ్మోహన్ అక్కడికి పరిశీలనకు వెళ్లారా? లేదంటే రీల్స్ కోసం వెళ్లారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం నాటికి ఈ ట్రోలింగ్ మరింతగా పెరిగిపోయింది.

చివరకు ప్రజాశాంతి పార్టీ అదినేత, క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కూడా రామ్మోహన్ పై విరుచుకుపడ్డారు. రామ్మోహన్ కు ఏవియేషన్ పై అసలు అవగాహనలే లేదని, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఎక్కడో జరిగిన పొరపాటుకు విమానం అయితే కూలింది. అయితే ఆ తప్పు నేరుగా కేంద్ర మంత్రే చేశారంటూ నిందించడం తగదు కదా. మరి అలాగని దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా… వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసుకుంటూ పోతే ఇక పాలన సాగేదెలా?

This post was last modified on June 13, 2025 9:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

16 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

46 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago