వైసీపీ హయాంలో విధించిన కొన్ని పన్నులతో అన్ని వ్యవస్థలు ఇబ్బందులు పడ్డాయి. వీటిలో ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ‘గ్రీన్ ట్యాక్స్’ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వాహనాలపై వైసీపీ హయాంలో జగన్.. గ్రీన్ ట్యాక్స్ బాదేశారు. అయితే.. అంతిమంగా ఇది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకే చుట్టుకుంది. దీంతో ఫీజులు కూడా పెరిగాయి. రవాణా చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆయా స్కూళ్ల యాజమాన్యాలతో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్పటి ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాయి. అయినా.. జగన్ వినిపించుకోలేదు.
తాజాగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ ట్యాక్స్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలల వాహనాలకు జగన్ హయాం లో విధించిన గ్రీన్ ట్యాక్స్ను రద్దుచేశారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులపై గ్రీన్ టాక్స్ ను రద్దు చేస్తున్నట్టు మండిపల్లి రాంప్రసాద్ చెప్పారు. కరోనా కాలంలో రెండు సంవత్సరాల పాటు స్కూల్స్ మూతబడిన నేపథ్యంలో వాడుకలో లేనైనప్పటికీ బస్సులకు పన్నులు వసూలు చేశారని చెప్పారు. విద్యా సంస్థల బస్సులు రోజుకు కేవలం 50-60 కిలోమీటర్లకే పరిమితమవుతాయని, సంవత్సరం పొడవునా 220 రోజులు మాత్రమే నడుస్తాయని, అయినా వాటిపై పన్నులు విధించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో చేపట్టిన విధానాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాహనాల జీవితకాలాన్ని రెండు సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యార్థుల తల్లిదండ్రులపై భారం తగ్గించాలని కూడా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గ్రీన్ ట్యాక్స్కు బదులుగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చేలా విద్యార్థులతో మొక్కలు పెంచేలా ప్రొత్సహించేం దుకు విద్యాసంస్థలకు అవగాహన కల్పిస్తామన్నారు. దీంతో జగన్ వేసిన భారం తొలిగిపోయిందని విద్యా సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వ్యాఖ్యానించారు.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…