వైసీపీ హయాంలో విధించిన కొన్ని పన్నులతో అన్ని వ్యవస్థలు ఇబ్బందులు పడ్డాయి. వీటిలో ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ‘గ్రీన్ ట్యాక్స్’ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వాహనాలపై వైసీపీ హయాంలో జగన్.. గ్రీన్ ట్యాక్స్ బాదేశారు. అయితే.. అంతిమంగా ఇది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకే చుట్టుకుంది. దీంతో ఫీజులు కూడా పెరిగాయి. రవాణా చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆయా స్కూళ్ల యాజమాన్యాలతో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్పటి ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాయి. అయినా.. జగన్ వినిపించుకోలేదు.
తాజాగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ ట్యాక్స్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలల వాహనాలకు జగన్ హయాం లో విధించిన గ్రీన్ ట్యాక్స్ను రద్దుచేశారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులపై గ్రీన్ టాక్స్ ను రద్దు చేస్తున్నట్టు మండిపల్లి రాంప్రసాద్ చెప్పారు. కరోనా కాలంలో రెండు సంవత్సరాల పాటు స్కూల్స్ మూతబడిన నేపథ్యంలో వాడుకలో లేనైనప్పటికీ బస్సులకు పన్నులు వసూలు చేశారని చెప్పారు. విద్యా సంస్థల బస్సులు రోజుకు కేవలం 50-60 కిలోమీటర్లకే పరిమితమవుతాయని, సంవత్సరం పొడవునా 220 రోజులు మాత్రమే నడుస్తాయని, అయినా వాటిపై పన్నులు విధించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో చేపట్టిన విధానాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాహనాల జీవితకాలాన్ని రెండు సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యార్థుల తల్లిదండ్రులపై భారం తగ్గించాలని కూడా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గ్రీన్ ట్యాక్స్కు బదులుగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చేలా విద్యార్థులతో మొక్కలు పెంచేలా ప్రొత్సహించేం దుకు విద్యాసంస్థలకు అవగాహన కల్పిస్తామన్నారు. దీంతో జగన్ వేసిన భారం తొలిగిపోయిందని విద్యా సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వ్యాఖ్యానించారు.
This post was last modified on June 13, 2025 9:08 pm
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…