Political News

యూపీఐ చెల్లింపులపై బాదుడు?…కేంద్రం క్లారిటీ ఇదే!

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా లెక్కలేనన్ని యూపీఐ యాప్ లు అందుబాటులోకి రావడంతో భారత్ లో మెజారిటీ జనం నగదుగా డబ్బు చెల్లించడం దాదాపుగా మానేశారు. ఈ పేమెంట్ యాప్ లలో దేనినో ఒకదాని ద్వారా వారు తమ చెల్లింపులు చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లలో భారత్ దూసుకుపోతోందని చెప్పక తప్పదు. కొందరైతే దాదాపుగా అన్ని యాప్ లను కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గతంలో ఓ దఫా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

తాజాగా గత రెండు, మూడు రోజులుగా ఇదే తరహా ప్రచారం మరోమారు ఊపందుకుంది. బుధవారం అయితే ప్రదాన  మీడియా సంస్థలన్నీ యూపీఐ చెల్లింపులపై బాదుడు తప్పదని ఏకంగా గణాంకాలతో సహా ఊదరగొట్టేశాయి. తెలుగు టాప్ న్యూస్ ఛానెళ్లు అయితే ఏకంగా స్టోరీల మీద స్టోరీలు ప్రసారం చేశాయి. వినియోగదారుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు కాకపోవడంతో తాము బాగా నష్టపోతున్నామని యూపీఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయని, తప్పని సరిగా చార్జీలు మోపాల్సందేనంటూ ప్రతిపాదించాయని ఆయా మీడియా సంస్థలు తెలిపాయి.

ఈ ప్రచారంపై కాస్తంత ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు మోపే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ క్లియర్ ప్రకటనను విడుదల చేసింది. యూపీఐ చెల్లింపుల్లో రూ.3 వేలు దాటితే కొంత మొత్తం మేర చార్జీ లని కొన్ని సంస్తలు, రూ.2 వేలు దాటితే కొంత చార్జీ అని మరికొన్ని సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు వార్తలను, ప్రకటనలను ఎవరూ నమ్మవద్దంటూ కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మరి కేంద్రం నుంచి ఇంతటి క్లారిటీ వచ్చిన తర్వాత అయినా ఈ వదంతులకు చెక్ పడుతుందో, లేదో చూడాలి.

This post was last modified on June 11, 2025 8:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: UPI Charges

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago