Political News

నేనున్నంత వ‌ర‌కు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్ కుటుంబంలోని ఏ ఒక్క‌రికీ కూడా.. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌కు అస‌లు శ‌త్రువులు అంటూ ఎవ‌రైనా ఉన్నారంటే..అది కేసీఆర్ కుటుంబ‌మేన‌ని చెప్పారు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబ‌మే ప్ర‌ధాన శ‌త్రువ‌ని తెలిపారు.

ఇక‌, కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న వారికి.. ఇచ్చే శాఖ‌ల‌పై కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాంటి చ‌ర్చ‌లూ చేయ‌లేద‌న్నారు. హైద‌రాబాద్‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. త‌న వ‌ద్ద ఉన్న శాఖ‌ల‌నే కొత్త‌వారికి కేటాయిస్తాన‌ని చెప్పారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి ఎలాంటి ప్ర‌యోజ నం చేకూర్చ‌డం లేద‌న్న రేవంత్ రెడ్డి.. తాము అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నా కూడా.. కిష‌న్ రెడ్డి అడ్డు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.

ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న‌లో ఆ కుటుంబం ఒక్క‌టే బాగుప‌డింద‌న్న రేవంత్ రెడ్డి.. కాళేశ్వ‌రం పేరుతో క‌మీష‌న్ల ప్రాజెక్టును క‌ట్టుకున్నార‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల క‌ష్టాన్ని దోచుకున్నార‌ని వ్యాఖ్యానించారు. తాను కూడా కాళే శ్వ‌రానికి సంబంధించిన నివేదిక‌ల‌ను బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో కుల గ‌ణ‌న‌పై మాత్ర‌మే పార్టీ అధిష్టానంతో చ‌ర్చించిన‌ట్టు రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పారు.

న‌క్స‌లిజం ఎప్ప‌టికి అంతం కాద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. సామాజిక అస‌మాన‌త‌లు ఉన్నంత కాలం న‌క్స‌లిజం ఉంటూనే ఉంటుంద‌న్నారు. కేంద్రంతో క‌లిసి ప‌నిచేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ.. రాష్ట్రానికి చెందిన వారే అడ్డుపుల్ల‌లు వేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on June 11, 2025 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

34 minutes ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

3 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

4 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

6 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

7 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

7 hours ago