అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చర్చ నిర్వహించిన జర్నలిస్ట్ కొమ్మినేని వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొమ్మినేని నీళ్లు నమిలారట. కృష్ణంరాజు అటువంటి వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖండించకుండా ఏం చేస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారట.
డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్ గా చర్చలో ఏ విషయాలు ప్రస్తావించాలి, చర్చించాలి, ఏ అంశాలపై చర్చను అనుమతించాలి అన్న స్పష్టత ఉంటుంది కదా అని కొమ్మినేనిని న్యాయమూర్తి నిలదీశారట. అమరావతి రాజధాని చుట్టూ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారని కృష్ణంరాజు దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని ఎందుకు ఖండించలేదని కొమ్మినేని కార్నర్ చేశారట. పైగా, ముస్లిం దేవతలు, క్రిస్టియన్ దేవతలు అని వ్యగ్యంగా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారట.
అలా మాట్లాడడాన్ని కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లేనని భావించవచ్చు కదా అని అన్నారట. కాబట్టి, మీరు శిక్షార్హులే అని జడ్జి అనడంతో కొమ్మినేని ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ సైలెంట్ అయ్యారట. ఆ తర్వాత తానేమీ మాట్లాడలేదని, తన తప్పేమీ లేదని కప్పిబుచ్చుకున్నారట. కానీ, జడ్జి మాత్రం కొమ్మినేని చేసిన కామెంట్లు సీరియస్ గా తీసుకొని ఆయనకు బెయిల్ నిరాకరించి…14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారట.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…