అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చర్చ నిర్వహించిన జర్నలిస్ట్ కొమ్మినేని వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొమ్మినేని నీళ్లు నమిలారట. కృష్ణంరాజు అటువంటి వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖండించకుండా ఏం చేస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారట.
డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్ గా చర్చలో ఏ విషయాలు ప్రస్తావించాలి, చర్చించాలి, ఏ అంశాలపై చర్చను అనుమతించాలి అన్న స్పష్టత ఉంటుంది కదా అని కొమ్మినేనిని న్యాయమూర్తి నిలదీశారట. అమరావతి రాజధాని చుట్టూ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారని కృష్ణంరాజు దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని ఎందుకు ఖండించలేదని కొమ్మినేని కార్నర్ చేశారట. పైగా, ముస్లిం దేవతలు, క్రిస్టియన్ దేవతలు అని వ్యగ్యంగా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారట.
అలా మాట్లాడడాన్ని కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లేనని భావించవచ్చు కదా అని అన్నారట. కాబట్టి, మీరు శిక్షార్హులే అని జడ్జి అనడంతో కొమ్మినేని ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ సైలెంట్ అయ్యారట. ఆ తర్వాత తానేమీ మాట్లాడలేదని, తన తప్పేమీ లేదని కప్పిబుచ్చుకున్నారట. కానీ, జడ్జి మాత్రం కొమ్మినేని చేసిన కామెంట్లు సీరియస్ గా తీసుకొని ఆయనకు బెయిల్ నిరాకరించి…14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారట.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…