బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయన పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు.. తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను దాచి పెట్టారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు.. ఈ వివరాలను దాచి పెట్టడం ద్వారా హరీష్ రావు తప్పులు చేశారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
అయితే.. దీనిపై కోర్టును ఆశ్రయించాలని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో చక్రధర్ గౌడ్.. హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో హరీష్రావు తప్పుడు లెక్కలు చూపించారని.. ఆయన ఆస్తులను అప్పులను కూడా దాచిపెట్టారని వ్యాఖ్యానించారు. ఇక, కేసుల వివరాలను కూడా చూపించలేదన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి.. హరీష్ రావు ఎన్నికను రద్దు చేయాలని కోరారు.
దీనిని విచారించిన హైకోర్టు.. హరీష్ రావును కూడా పలుమార్లు విచారణకు పిలిచింది. దీనిపై ఎన్నికల సంఘం అభిప్రాయం కూడా తీసుకుంది. అయితే.. హరీష్రావు వాస్తవాలే వెల్లడించారని.. ఇది రాజకీయ దురుద్దేశ పూరిత కుట్ర మేరకే కేసును నమోదు చేశారన్న వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కేసును తాజాగా కొట్టి వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో హరీష్రావుపై ఉన్న ఎన్నికల పిటిషన్ కొట్టివేసినట్టు అయింది. కాగా.. ఇదంతా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్న పనేనని హరీష్రావు ఆరోపించారు.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…