బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయన పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు.. తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను దాచి పెట్టారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు.. ఈ వివరాలను దాచి పెట్టడం ద్వారా హరీష్ రావు తప్పులు చేశారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
అయితే.. దీనిపై కోర్టును ఆశ్రయించాలని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో చక్రధర్ గౌడ్.. హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో హరీష్రావు తప్పుడు లెక్కలు చూపించారని.. ఆయన ఆస్తులను అప్పులను కూడా దాచిపెట్టారని వ్యాఖ్యానించారు. ఇక, కేసుల వివరాలను కూడా చూపించలేదన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి.. హరీష్ రావు ఎన్నికను రద్దు చేయాలని కోరారు.
దీనిని విచారించిన హైకోర్టు.. హరీష్ రావును కూడా పలుమార్లు విచారణకు పిలిచింది. దీనిపై ఎన్నికల సంఘం అభిప్రాయం కూడా తీసుకుంది. అయితే.. హరీష్రావు వాస్తవాలే వెల్లడించారని.. ఇది రాజకీయ దురుద్దేశ పూరిత కుట్ర మేరకే కేసును నమోదు చేశారన్న వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కేసును తాజాగా కొట్టి వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో హరీష్రావుపై ఉన్న ఎన్నికల పిటిషన్ కొట్టివేసినట్టు అయింది. కాగా.. ఇదంతా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్న పనేనని హరీష్రావు ఆరోపించారు.
This post was last modified on June 10, 2025 3:15 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…