Political News

తీరు మారని కృష్ణంరాజుకు జాతీయ మహిళా కమిషన్ షాక్

మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో, డిబేట్లలో పాల్గొనే సమయంలో వక్తలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ వక్త రాజకీయ నేత అయినా…జర్నలిస్ట్ అయినా..ఫిల్మ్ స్టార్ అయినా సరే…నోరు జారితే మూల్యం చెల్లించక తప్పదు. అయితే పొరపాటునో..గ్రహపాటునో టంగ్ స్లిప్ అయి ఉంటే…ఆ వెంటనే క్షమాపణలు చెప్పి ఆ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టిన వారిని చూశాం. కానీ, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఆయనకు షాకిచ్చింది.

మహిళలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా ఎన్ సీ డబ్ల్యూ తీసుకుంది. ఈ ప్రకారం ఏపీ డీజీపీకి ఎసీ డబ్ల్యూ ఛైర్ పర్సన్ విజయ రాహత్కర్ లేఖ రాశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, అటువంటి మహిళలను ఆయన అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ రాజధాని అమరావతితో పాటు యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే రీతిలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయినా సరే పశ్చాత్తాప పడని ఆయన…తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్న తీరు మరింత వివాదాస్పదంగా మారుతోంది. తనపై కేసులు నమోదవుతున్నా సరే…తన కామెంట్లను కవర్ చేసేందుకు పాత పేపర్ క్లిప్పింగులు చూపిస్తూ తాను తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఆయన మరింత దిగజారి పోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాలలో వ్యభిచారం చేస్తూ పట్టుబడడం, పోలీసులు తీసుకువెళ్లడం, కేసులు నమోదు కావడం సర్వ సాధారణం అని, అటువంటిది కేవలం అమరావతిలోనే జరుగుతోంది అన్న రీతిలో ఆయన హైలైట్ చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణం రాజు వంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

This post was last modified on June 10, 2025 1:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

38 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

45 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago