Political News

తీరు మారని కృష్ణంరాజుకు జాతీయ మహిళా కమిషన్ షాక్

మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో, డిబేట్లలో పాల్గొనే సమయంలో వక్తలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ వక్త రాజకీయ నేత అయినా…జర్నలిస్ట్ అయినా..ఫిల్మ్ స్టార్ అయినా సరే…నోరు జారితే మూల్యం చెల్లించక తప్పదు. అయితే పొరపాటునో..గ్రహపాటునో టంగ్ స్లిప్ అయి ఉంటే…ఆ వెంటనే క్షమాపణలు చెప్పి ఆ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టిన వారిని చూశాం. కానీ, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఆయనకు షాకిచ్చింది.

మహిళలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా ఎన్ సీ డబ్ల్యూ తీసుకుంది. ఈ ప్రకారం ఏపీ డీజీపీకి ఎసీ డబ్ల్యూ ఛైర్ పర్సన్ విజయ రాహత్కర్ లేఖ రాశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, అటువంటి మహిళలను ఆయన అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ రాజధాని అమరావతితో పాటు యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే రీతిలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయినా సరే పశ్చాత్తాప పడని ఆయన…తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్న తీరు మరింత వివాదాస్పదంగా మారుతోంది. తనపై కేసులు నమోదవుతున్నా సరే…తన కామెంట్లను కవర్ చేసేందుకు పాత పేపర్ క్లిప్పింగులు చూపిస్తూ తాను తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఆయన మరింత దిగజారి పోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాలలో వ్యభిచారం చేస్తూ పట్టుబడడం, పోలీసులు తీసుకువెళ్లడం, కేసులు నమోదు కావడం సర్వ సాధారణం అని, అటువంటిది కేవలం అమరావతిలోనే జరుగుతోంది అన్న రీతిలో ఆయన హైలైట్ చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణం రాజు వంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

This post was last modified on June 10, 2025 1:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

4 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

8 hours ago

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…

10 hours ago

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…

10 hours ago

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు…

11 hours ago

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…

11 hours ago