ఏపీలో రేషన్ కార్డుల దరఖాస్తు విధానం మొదలు పంపిణీ వరకు కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో రేష్ కార్డు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు. వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ వంటి సౌకర్యాలు కల్పించి ప్రజల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ పంపిణీ వ్యవహారంలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పీవోఎస్ మెషీన్ సర్వర్ పనిచేయనప్పుడు అవసరమైతే లబ్ధిదారుల ఫొటో, సంతకం తీసుకొని రేషన్ ఇవ్వాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేగానీ, సర్వర్ పనిచేయడం లేదంటూ రేషన్ తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులను వెనక్కు పంపవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని డీలర్లకు చెప్పారు. ఏలూరులో ఓ రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మనోహర్ అక్కడ రేషన్ పంపిణీలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆ దుకాణంలో బియ్యంతోపాటు ఇతర సరుకులను భద్రపరుస్తున్న తీరు, తూకం వంటి పలు విషయాలను మనోహర్ పరిశీలించారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం రేషన్ అందిస్తున్న విధానం బాగుందని లబ్దిదారులు మనోహర్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో డోర్ డెలివరీ అని చెప్పినా…రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడేవాళ్లమని, వాహనం వచ్చినా వీధి చివర రేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని చెప్పారు. వృద్ధులు మరియు వికలాంగులకు రేషన్ ఇంటికే డోర్ డెలివరీ విధానం బాగుందని అంటున్నారు. రేషన్ షాపులు రెండు పూటలా తెరవడం వల్ల తమకు వీలున్న సమయంలో వచ్చి రేషన్ తీసుకుంటున్నామని చెబుతున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…