Political News

ఆర్థిక సంపద పెంచి పేదలకు పంచుతాం: చంద్రబాబు

ఏపీలో ‘స్వ‌ర్ణాంధ్ర‌’ పేరుతో సీఎం చంద్ర‌బాబు కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ప్ర‌భుత్వం వాట్సాప్ ద్వారా 300 ర‌కాల సేవ‌ల‌ను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వ‌ర్ణాంధ్ర కార్యాల‌యాల ద్వారా సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. ఈ కార్యాల‌యాల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. స‌ర్వీస్ సెక్టార్ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు.

రాష్ట్రానికి ఆదాయం పెరిగితే.. దానిని పేద‌ల‌కు పంపిణీ చేస్తామ‌ని.. సంప‌ద సృష్టి ద్వారా మ‌రిన్ని ప‌థ‌కాల‌ను అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స‌ర్వీస్ సెక్టార్ ద్వారా ప్ర‌భుత్వం నూటికి ఆరు రూపాయ‌లు మాత్ర‌మే ఆదాయం వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సేవా రంగాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా సాంకేతిక‌త‌ను వినియోగించుకుని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రంగానికి కీల‌కంగా మార్చ‌నున్న‌ట్టు తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ నెల‌లోనే త‌ల్లికి వంద‌నం, ఆగ‌స్టు 15న ఉచిత ఆర్టీసీ బ‌స్సు వంటివి అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కేవ‌లం సంక్షేమమే కాకుండా.. అభివృధ్ది-సంక్షేమాన్ని కూడా స‌మాంత‌రంగా ముందుకు తీసుకువెళ్ళ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామ‌న్నారు. అనేక రంగాలు గ‌త పాల‌కుల కార‌ణంగా విధ్వంస‌మ‌య్యాయ‌ని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామ‌న్న చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా మ‌రో మూడేళ్ల‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

29 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago