Political News

ఆర్థిక సంపద పెంచి పేదలకు పంచుతాం: చంద్రబాబు

ఏపీలో ‘స్వ‌ర్ణాంధ్ర‌’ పేరుతో సీఎం చంద్ర‌బాబు కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ప్ర‌భుత్వం వాట్సాప్ ద్వారా 300 ర‌కాల సేవ‌ల‌ను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వ‌ర్ణాంధ్ర కార్యాల‌యాల ద్వారా సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. ఈ కార్యాల‌యాల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. స‌ర్వీస్ సెక్టార్ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు.

రాష్ట్రానికి ఆదాయం పెరిగితే.. దానిని పేద‌ల‌కు పంపిణీ చేస్తామ‌ని.. సంప‌ద సృష్టి ద్వారా మ‌రిన్ని ప‌థ‌కాల‌ను అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స‌ర్వీస్ సెక్టార్ ద్వారా ప్ర‌భుత్వం నూటికి ఆరు రూపాయ‌లు మాత్ర‌మే ఆదాయం వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సేవా రంగాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా సాంకేతిక‌త‌ను వినియోగించుకుని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రంగానికి కీల‌కంగా మార్చ‌నున్న‌ట్టు తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ నెల‌లోనే త‌ల్లికి వంద‌నం, ఆగ‌స్టు 15న ఉచిత ఆర్టీసీ బ‌స్సు వంటివి అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కేవ‌లం సంక్షేమమే కాకుండా.. అభివృధ్ది-సంక్షేమాన్ని కూడా స‌మాంత‌రంగా ముందుకు తీసుకువెళ్ళ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామ‌న్నారు. అనేక రంగాలు గ‌త పాల‌కుల కార‌ణంగా విధ్వంస‌మ‌య్యాయ‌ని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామ‌న్న చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా మ‌రో మూడేళ్ల‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on June 9, 2025 9:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

4 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

6 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

9 hours ago

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

9 hours ago

నా ఉద్దేశం అది కాదంటున్న అనన్య

చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ్‌లోకి మార్చి, వాటి ద్వారా హాట్…

9 hours ago

మళ్ళీ వస్తామంటున్న ‘యువ’ జంట

టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…

9 hours ago