Political News

ఆర్థిక సంపద పెంచి పేదలకు పంచుతాం: చంద్రబాబు

ఏపీలో ‘స్వ‌ర్ణాంధ్ర‌’ పేరుతో సీఎం చంద్ర‌బాబు కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ప్ర‌భుత్వం వాట్సాప్ ద్వారా 300 ర‌కాల సేవ‌ల‌ను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వ‌ర్ణాంధ్ర కార్యాల‌యాల ద్వారా సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. ఈ కార్యాల‌యాల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. స‌ర్వీస్ సెక్టార్ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు.

రాష్ట్రానికి ఆదాయం పెరిగితే.. దానిని పేద‌ల‌కు పంపిణీ చేస్తామ‌ని.. సంప‌ద సృష్టి ద్వారా మ‌రిన్ని ప‌థ‌కాల‌ను అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స‌ర్వీస్ సెక్టార్ ద్వారా ప్ర‌భుత్వం నూటికి ఆరు రూపాయ‌లు మాత్ర‌మే ఆదాయం వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సేవా రంగాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా సాంకేతిక‌త‌ను వినియోగించుకుని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రంగానికి కీల‌కంగా మార్చ‌నున్న‌ట్టు తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ నెల‌లోనే త‌ల్లికి వంద‌నం, ఆగ‌స్టు 15న ఉచిత ఆర్టీసీ బ‌స్సు వంటివి అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కేవ‌లం సంక్షేమమే కాకుండా.. అభివృధ్ది-సంక్షేమాన్ని కూడా స‌మాంత‌రంగా ముందుకు తీసుకువెళ్ళ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామ‌న్నారు. అనేక రంగాలు గ‌త పాల‌కుల కార‌ణంగా విధ్వంస‌మ‌య్యాయ‌ని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామ‌న్న చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా మ‌రో మూడేళ్ల‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on June 9, 2025 9:15 pm

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

2 hours ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

3 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

3 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

3 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

5 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

6 hours ago