ఏపీలో ‘స్వర్ణాంధ్ర’ పేరుతో సీఎం చంద్రబాబు కార్యాలయాలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నారు. వాస్తవానికి ఇప్పటికే డిజిటల్ గవర్నెన్స్ పేరుతో ప్రభుత్వం వాట్సాప్ ద్వారా 300 రకాల సేవలను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిటల్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర కార్యాలయాల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ కార్యాలయాలను వర్చువల్గా ఆయన ప్రారంభించారు. సర్వీస్ సెక్టార్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రానికి ఆదాయం పెరిగితే.. దానిని పేదలకు పంపిణీ చేస్తామని.. సంపద సృష్టి ద్వారా మరిన్ని పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం సర్వీస్ సెక్టార్ ద్వారా ప్రభుత్వం నూటికి ఆరు రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సేవా రంగాన్ని మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా సాంకేతికతను వినియోగించుకుని రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రంగానికి కీలకంగా మార్చనున్నట్టు తెలిపారు.
గత ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ను అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత ఆర్టీసీ బస్సు వంటివి అమలు చేయనున్నట్టు తెలిపారు. కేవలం సంక్షేమమే కాకుండా.. అభివృధ్ది-సంక్షేమాన్ని కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళనున్నట్టు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామన్నారు. అనేక రంగాలు గత పాలకుల కారణంగా విధ్వంసమయ్యాయని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు రాజధాని అమరావతిని కూడా మరో మూడేళ్లలోనే పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
This post was last modified on June 9, 2025 9:15 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…