Political News

జ‌గ‌న్‌-భార‌తి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే: ష‌ర్మిల‌

అమ‌రావ‌తి విష‌యంపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌ను తీవ్రంగా అవ‌మానించిన వ్య‌వ‌హారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల స్పందించారు. ఈ వ్య‌వ‌హారంపై జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. అస‌లు రాజ‌ధానిపై మాట్లాడే అర్హ‌త సాక్షి యాజమాన్యానికి లేద‌న్నారు. గ‌తంలో అనేక సార్లు కూడా అవ‌మానక‌రంగా ఇక్క‌డి వారిని మాట్లాడార‌ని.. చెప్పారు. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చిన త‌ర్వాత‌.. అయినా జ‌గ‌న్‌లో మార్పు రావాల్సి ఉంద‌న్నారు.

కానీ, ప‌దే ప‌దే అమ‌రావ‌తిపై విషం చిమ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా చేప‌ట్టిన చ‌ర్చ‌లో మ‌హిళ‌ల‌ను తీసుకురావ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. సోమ‌వారం చిత్తూరు జిల్లాకు వ‌చ్చిన ష‌ర్మిల‌.. మీడియాతో మాట్లాడారు. మ‌హిళ‌ల‌ను అవ‌మానించే సంస్కృతి వైసీపీతోనే ప్రారంభ‌మైంద‌ని దుయ్య‌బ‌ట్టారు. సాక్షి చానెల్‌కు కూడా ఈ విష సంస్కృతి విస్త‌రించింద‌న్నారు. ఈ విషయంలో జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతోపాటు భారతితోనూ చెప్పించి ఉంటే బాగుండేద‌ని వ్యాఖ్యానించారు. త‌ప్పు జ‌రిగింది ఛానెల్‌లో కాబ‌ట్టి.. వారిద్ద‌రే బాధ్యుల‌ని వ్యాఖ్యానించారు.

ప‌దేళ్లుగా రాష్ట్రానికి రాజ‌ధాని లేద‌ని.. ఇప్పుడు అంతో ఇంతో క‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ష‌ర్మిల చెప్పారు. ఈ స‌మ‌యంలో మ‌రో దెబ్బ కొట్టేలా ఇక్క‌డివారిని వ్యాఖ్యానించ‌డం దారుణ‌మ‌ని అన్నారు. రాష్ట్రానికి కేరాఫ్ లేని ప‌రిస్థితి నుంచి ఇప్పుడు రాజ‌ధాని ఏర్పాటు చేసుకునే ద‌శ‌లో ఉన్నామ‌ని.. ఇలాంటి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌ను ఏ రూపంలో కించ ప‌రిచినా అది క్ష‌మించ‌రాని నేర‌మేన‌ని చెప్పారు. మీడియా హౌస్ య‌జ‌మానిగా భార‌తీ రెడ్డి అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. ఇది త‌ప్పుకాద‌ని బాధ్య‌త‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా జ‌గ‌న్ కూడా ఆ మీడియా హౌస్ వ్య‌క్తే కాబ‌ట్టి ఆయ‌న కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇక‌, సాక్షి మీడియాకు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌తో ప‌నిలేకుండా పోయింద‌ని.. ఒక పార్టీకి కొమ్ము కాస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఏనాడైనా గ‌ళం వినిపించిందా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఇలాంటి మీడియా సంస్థ‌ను చూస్తే జాలేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పేన‌ని అన్నారు.

This post was last modified on June 9, 2025 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago