తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మహాలక్ష్మి పథకం కింద.. రాష్ట్రంలో గత 15 నెలలకుపైగానే ఉచిత ఆర్టీసీ బస్సును మహిళలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివల్ల చాలా నష్టాలు వస్తున్నాయన్నది ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న మాట. అయినప్పటికీ.. పంటిబిగువన ఆ భారాలను ప్రభుత్వం భరిస్తోంది.
ఇక, ఆ భారాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రజలపై భారాలు మోపేందుకు సర్కారు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ బస్సు చార్జీలతోపాటు.. అన్ని రకాల పాసుల చార్జీలను కూ డా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. మొత్తంగా నూటికి రూ.20 చొప్పున ధరలను పెంచడం గమనార్హం. తద్వారా.. సాధారణ, మధ్యతరగతి ప్రజలపై పెను భారమే పడనుందని తెలుస్తోంది.
ఇవీ.. ధరలు..
ఏం జరుగుతుంది?
కారణాలు ఏవైనా ఇలా.. బస్సు చార్జీల ధరలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళల కు మాత్రమే ఉచితంగా బస్సులను పరిమితం చేశారు. కానీ, ఇదేసమయంలో ధరలు పెంచడంతో అన్ని వర్గాల్లో నూ సర్కారు తీరుపు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పథకాల అమలు విషయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇలా చార్జీల భారం మోపడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగాసాగుతుండడం గమనార్హం.
This post was last modified on June 9, 2025 6:08 pm
కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ…
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, నటసింహం బాలయ్య గారాలపట్టి నారా బ్రాహ్మణి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద…
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి…
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ…