Political News

‘ఆర్టీసీ’ బాదుడు.. రేవంత్ స‌ర్కారుపై జ‌నం టాక్ ఇదే!

తెలంగాణ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ చార్జీల‌ను భారీగా పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌.. రాష్ట్రంలో గ‌త 15 నెల‌లకుపైగానే ఉచిత ఆర్టీసీ బ‌స్సును మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివ‌ల్ల చాలా న‌ష్టాలు వ‌స్తున్నాయ‌న్న‌ది ఆర్టీసీ యాజ‌మాన్యం చెబుతున్న మాట‌. అయిన‌ప్ప‌టికీ.. పంటిబిగువ‌న ఆ భారాల‌ను ప్ర‌భుత్వం భ‌రిస్తోంది.

ఇక‌, ఆ భారాలు మ‌రింత పెరుగుతున్న నేప‌థ్యంలో తాజాగా ప్ర‌జ‌ల‌పై భారాలు మోపేందుకు స‌ర్కారు రెడీ అయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సాధార‌ణ బ‌స్సు చార్జీల‌తోపాటు.. అన్ని ర‌కాల పాసుల చార్జీల‌ను కూ డా పెంచుతూ ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని కూడా చెప్పారు. మొత్తంగా నూటికి రూ.20 చొప్పున ధ‌ర‌ల‌ను పెంచ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా.. సాధార‌ణ‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై పెను భార‌మే ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇవీ.. ధ‌ర‌లు..

  • రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ రూ.1,400కు పెర‌గ‌నుంది.
  • రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ రూ.1,600కు చేర‌నుంది.
  • రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ రూ.1,800కు పెరుగుతుంది.
  • గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా 20 శాతం చొప్పున పెర‌గ‌నున్నాయి.

ఏం జ‌రుగుతుంది?

కార‌ణాలు ఏవైనా ఇలా.. బ‌స్సు చార్జీల ధ‌ర‌ల‌ను పెంచ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌హిళల కు మాత్ర‌మే ఉచితంగా బ‌స్సుల‌ను ప‌రిమితం చేశారు. కానీ, ఇదేస‌మ‌యంలో ధ‌ర‌లు పెంచ‌డంతో అన్ని వ‌ర్గాల్లో నూ స‌ర్కారు తీరుపు అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా ఇత‌ర ప‌థ‌కాల అమ‌లు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టిన ప్ర‌భుత్వం ఇలా చార్జీల భారం మోప‌డం ఏంట‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో మ‌రింత ఎక్కువ‌గాసాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 9, 2025 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

52 minutes ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

56 minutes ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

1 hour ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

2 hours ago

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

4 hours ago