తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మహాలక్ష్మి పథకం కింద.. రాష్ట్రంలో గత 15 నెలలకుపైగానే ఉచిత ఆర్టీసీ బస్సును మహిళలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివల్ల చాలా నష్టాలు వస్తున్నాయన్నది ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న మాట. అయినప్పటికీ.. పంటిబిగువన ఆ భారాలను ప్రభుత్వం భరిస్తోంది.
ఇక, ఆ భారాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రజలపై భారాలు మోపేందుకు సర్కారు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ బస్సు చార్జీలతోపాటు.. అన్ని రకాల పాసుల చార్జీలను కూ డా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. మొత్తంగా నూటికి రూ.20 చొప్పున ధరలను పెంచడం గమనార్హం. తద్వారా.. సాధారణ, మధ్యతరగతి ప్రజలపై పెను భారమే పడనుందని తెలుస్తోంది.
ఇవీ.. ధరలు..
ఏం జరుగుతుంది?
కారణాలు ఏవైనా ఇలా.. బస్సు చార్జీల ధరలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళల కు మాత్రమే ఉచితంగా బస్సులను పరిమితం చేశారు. కానీ, ఇదేసమయంలో ధరలు పెంచడంతో అన్ని వర్గాల్లో నూ సర్కారు తీరుపు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పథకాల అమలు విషయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇలా చార్జీల భారం మోపడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగాసాగుతుండడం గమనార్హం.
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…