తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మహాలక్ష్మి పథకం కింద.. రాష్ట్రంలో గత 15 నెలలకుపైగానే ఉచిత ఆర్టీసీ బస్సును మహిళలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివల్ల చాలా నష్టాలు వస్తున్నాయన్నది ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న మాట. అయినప్పటికీ.. పంటిబిగువన ఆ భారాలను ప్రభుత్వం భరిస్తోంది.
ఇక, ఆ భారాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రజలపై భారాలు మోపేందుకు సర్కారు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ బస్సు చార్జీలతోపాటు.. అన్ని రకాల పాసుల చార్జీలను కూ డా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. మొత్తంగా నూటికి రూ.20 చొప్పున ధరలను పెంచడం గమనార్హం. తద్వారా.. సాధారణ, మధ్యతరగతి ప్రజలపై పెను భారమే పడనుందని తెలుస్తోంది.
ఇవీ.. ధరలు..
ఏం జరుగుతుంది?
కారణాలు ఏవైనా ఇలా.. బస్సు చార్జీల ధరలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళల కు మాత్రమే ఉచితంగా బస్సులను పరిమితం చేశారు. కానీ, ఇదేసమయంలో ధరలు పెంచడంతో అన్ని వర్గాల్లో నూ సర్కారు తీరుపు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పథకాల అమలు విషయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇలా చార్జీల భారం మోపడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగాసాగుతుండడం గమనార్హం.
This post was last modified on June 9, 2025 6:08 pm
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…