Political News

సాక్షి జర్నలిస్ట్ అరెస్టుపై స్పందించిన జగన్

సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టును పెట్టారు. అందులో కొమ్మినేనిని 70 ఏళ్ల వృద్ధుడిగా, సీనియర్ జర్నలిస్టుగా ఆయన పేర్కొన్నారు. కొమ్మినేని అరెస్టుతో కూటమి సర్కారు కక్షసాధింపుల విష సంస్కృతిని పతాకస్థాయికి తీసుకెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు.

కొమ్మినేని అరెస్టును తప్పుబట్టిన జగన్…అసలు కొమ్మినేని చేసిన తప్పేమిటని కూడా ప్రశ్నించారు. ఓ చర్చా కార్యక్రమంలో వక్తలు మాట్లాడే దానికి ఆ చర్చను నిర్వహించే యాంకర్ కు ఏం సంబంధం ఉంటుందని కూడా జగన్ ప్రశ్నించారు. సహజంగానే ఆయా డీబేట్లలో కొందరు వక్తలు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారని, వాటిని యాంకర్ కు ఆపాదిస్తే ఎలాగని ఆయన ప్రశ్నించారు. కొన్ని టీవీ ఛానెళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్ట్ లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా?.. ఆ తరహా డీబేట్ లు ఇప్పటికీ కొనసాగడం లేదా? అని కూడా జగన్ ప్రశ్నించారు.

ఏపీ అరాచకానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిందన్న జగన్..ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేథావులు, జర్నలిస్లులను భయకంపితులను చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన ఏడాది కాలంగా చంద్రబాబు సర్కారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ తరహా అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన మోసాలు, అవినీతి, వైఫల్యాలు బయటపడకుండా, వాటిపై ఆయా వర్గాలు గొంతెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ తరహా అరాచక పాలనకు తెర తీశారని జగన్ ఆరోపించారు. 

కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష ఈనాటిది కాదని కూడా జగన్ చెప్పుకొచ్చారు. 2014-19 మధ్యకాలంలో కొమ్మినేని పని చేస్తున్న మీడియా సంస్థలో ఆయనకు ఉద్యోగం లేకుండా చంద్రబాబు చేశారని కూడా జగన్ ఆరోపించారు. సాక్షిలోకి వచ్చిన తర్వాత కూడా కొమ్మినేని తనకు మద్దతుగా లేరన్న భావనతోనే ఆయనను అరెస్టు చేయించారని ఆరోపించారు. చివరలో బాబుకు ప్రజలు అదికారం ఇచ్చింది ఐదేళ్లేనన్న జగన్… అందులో ఇప్పటికే ఓ ఏడాది పూర్తి అయిపోయిందని తెలిపారు. ఇప్పుడు మీరు ఏది విత్తుతారో, అదే రేపు మొలకెత్తుతుందని, అది ఇంకా రెండింతలు అవుతుందని కూడా జగన్ హెచ్చరించారు. 

Kumar

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

14 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

1 hour ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

3 hours ago