Political News

అన్నీ నిజాలే చెప్పా: హ‌రీష్ రావు

కాళేశ్వరం క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ పీసీ ఘోష్ విచార‌ణ‌కు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్ రావు సోమ‌వారం హాజ‌ర‌య్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న‌ను క‌మిష‌న్ స‌భ్యులు విచా రించారు. అనంత‌రం మీడియా ముందుకు వ‌చ్చిన హ‌రీష్ రావు.. క‌మిష‌న్ స‌భ్యులు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్నకూ తాను.. అన్నీ నిజాలే చెప్పాన‌ని తెలిపారు. ముఖ్యంగా రీ డిజైనింగ్‌పై ఎక్కువ‌గా గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించార‌ని తెలిపారు. అయితే.. దీనిపై త‌మ‌కు స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు.

అందుకే ఆధారాల‌తో స‌హా ఎందుకు రీడిజైన్ చేయాల్సివ‌చ్చిందో వివ‌రించాన‌ని హ‌రీష్ పేర్కొన్నారు. ప్రాజెక్టు కు సంబంధించిన డీపీఆర్ నుంచి లే అవుట్ వ‌ర‌కు అన్నీ క‌మిష‌న్‌కు సంపూర్ణంగా వివ‌రించాన న్నారు. “దీనిలో దాచుకునేందుకు.. దాచిపెట్టేందుకు కూడా ఏమీ లేదు. అంతా ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే వివ‌రించా. మహారాష్ట్ర స‌హా.. సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌( సీడబ్ల్యూసీ) చేసిన అభ్యంతరాల కార‌ణంగానే ప్రాజెక్టును రీ డిజైన్ చేయాల్సి వ‌చ్చింది.” అని వివ‌రించారు.

అన్ని విష‌యాల‌ను కేంద్రానికి… కేంద్ర జ‌ల సంఘానికి వివ‌రిస్తూనే ఉన్నామ‌ని.. ప్రాజెక్టు విష‌యంలో ఎలాంటి తేడా లేద‌న్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లప‌ల్లి బ్యారేజీల గురించి త‌న‌ను ప్ర‌శ్నించార‌ని హ‌రీష్ రావు చెప్పారు. అయితే.. వాటికి కేబినెట్ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని.. దీనికి సంబంధించిన మినిట్స్ న‌క‌లును కూడా క‌మిష‌న్‌కు ఇచ్చాన‌న్నారు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు.

ఇక‌, కీల‌క‌మైన సొమ్ముల దుర్వినియోగంపైనా.. ప్రాజెక్టు వ్య‌యం పెంపుపైనా త‌న‌ను ప్ర‌శ్నించిన‌ట్టు హ‌రీష్ రావు పేర్కొన్నారు. అయితే.. ప్రాజెక్టును రీ డిజైన్ చేయ‌డం వ‌ల్లే.. ఖ‌ర్చు పెరిగింద‌ని.. దీనిని కూడా అప్ప టి మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. దీనికి కార్పొరేష‌న్‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించారు. కేంద్రప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు తెలిపారు.

This post was last modified on June 9, 2025 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

6 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

8 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

11 hours ago

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

11 hours ago

నా ఉద్దేశం అది కాదంటున్న అనన్య

చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ్‌లోకి మార్చి, వాటి ద్వారా హాట్…

11 hours ago

మళ్ళీ వస్తామంటున్న ‘యువ’ జంట

టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…

11 hours ago