Political News

రేర్ వీడియో!.. కేసీఆర్ పక్కన లోకేశ్!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీలో అధికార కూటమి రథసారథి టీడీపీ అంటే నిత్యం ఎగిరెగిరిపడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఇద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చుని కనిపించారు. అంతేకాదండోయ్… కేసీఆర్, లోకేశ్ లు కలిసి కూర్చోగా, కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి వెనకాలే నిలబడి కనిపించారు. ఈ సన్నివేశం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నివాళి అర్పించే సందర్భంగా కనిపించింది.

మాగంటి పూర్వాశ్రమంలో టీడీపీ నేతే. అంతేనా టీడీపీతోనే మాగంటి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన మాగంటి బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీలో ఎంత కీలక నేతగా ఎదిగారో బీఆర్ఎస్ లోనూ అంతే కీలక నేతగా ఎదిగారు. కేసీఆర్ నమ్మకస్తుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు.

గుండెపోటు కారణంగా గత గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి…చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మరణించారు. ఈ క్రమంలో తనకు అత్యంత నమ్మకస్తుడిగా కొనసాగిన మాగంటికి నివాళి అర్పించేందుకు కేసీఆర్ స్వయంగా తరలివచ్చారు. మాగంటి భౌతిక కాయాన్ని చూసి ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. అదే సమయంలో లోకేశ్ కూడా మాగంటికి నివాళి అర్పించేందుకు తన సతీమణి బ్రాహ్మణితో కలిసి వచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కూర్చున్న దగ్గరకు వచ్చిన లోకేశ్… ఆయన పక్కనే కూర్చున్నారు. బ్రాహ్మణి కూడా వారి పక్కనే కూర్చున్నారు. వారిద్దరూ ఇలా చాలాసేపే అలా పక్కపక్కనే కూర్చున్నప్పటికీ వారి మధ్య మాటలు అయితే పెగల లేదనే చెప్పాలి. మాగంటి మృతితో కేసీఆర్ నోట మాట రాని స్థితిలోకి వెళ్లగా…టీడీపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న మాగంటి మరణంతో లోకేశ్ కూడా ఆయనతో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఉండిపోయారు. వెరసి కేసీఆర్, లోకేశ్ లు చాలా సేపు కలిసే కూర్చున్నా వారు మాట్లాడుకోలేకపోయారు.

Satya

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

1 hour ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

2 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

5 hours ago