కూటమి ప్రభుత్వంలో పార్టీల నాయకుల తీరు .. “అయితే ఏంటి?” అన్నట్టుగానే ఉంది. టీడీపీలోనే కాదు.. జనసేన, బీజేపీల్లో కూడా.. నాయకుల వ్యవహార శైలి.. ఆయా పార్టీల అధినేతలకు, అదిష్టానానికి కూడా తలనొప్పిగానే మారింది. అందరూ అని కాదు కానీ… కొందరు మాత్రం తమ తీరును మార్చుకోలేక పోతున్నారన్న చర్చ పార్టీలలో విస్తృతంగా సాగుతోంది. “సొంత పార్టీ.. అయితే ఏంటి?” అనే తరహాలో నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
తాజాగా అనంతపురం నాయకుల తీరుపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకుల వ్యవహారం.. ఇప్పటికీ జనసేనలో కాక రేపుతూనే ఉంది. ఒకరిద్దరు నాయకులు పార్టీ కార్యక్రమాల్లో ఉన్నా.. కొందరిని మాత్రమే కలుస్తున్నారు. కొందరితోనే టచ్లో ఉంటున్నారు. మిగిలిన వారిపై ఇతర ముద్రలు వేస్తున్నారు. ఇక, బీజేపీలో అయితే.. గత ఏడాది నుంచి ఉన్న విధానాలు ఇప్పటికీ మారలేదు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేశారని ఒప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు రాజీ పడలేని పరిస్థితి నెలకొంది. విజయవాడలో అయితే.. ఎవరికి వారు అన్నట్టుగా కూటమి పార్టీల నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ లైట్ తీసుకున్నారు. ఇక, ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, పవన్ ఎంతో సీరియస్గా తీసుకున్నారు.
ప్రధాని మోడీ ముందు పరువు కాపాడాలని కూడా.. వారు పార్టీ నాయకులకు అంతర్గత చర్చల్లో చెప్పుకొ చ్చారు. కానీ, ఏం లాభం. ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి అంతగా సహకరించడం లేదు. దీంతో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమాలే హైలెట్ అవుతున్నాయి. ఈ విషయంలో పార్టీ నాయకుల మధ్య కలివిడి లేకపోవడంతో మూడు పార్టీల్లోనూ ఈ వ్యవహారం చర్చగా మారింది. ఇప్పటి వరకు ఎలా జరిగినా.. ఈ యోగాంధ్రను సక్సెస్ చేయాలని అధినేతలు చెబుతున్నారు. అయినా.. ‘అయితే ఏంటి?’ అనే టైపులో నాయకులు వ్యవహరిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 8, 2025 4:36 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…