ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. గత నాలుగు రోజులుగా ఇక్కడ ఇసుక తవ్వకాలు అనధికారికంగా జరుగుతున్నాయని.. పట్టించుకునే నాధుడు కూడా లేడని.. సాక్షాత్తూ.. టీడీపీ నాయకుడు, పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన.. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి మీడియాను కూడా తీసుకువెళ్లారు. స్తానికంగా ఉన్న పరిస్థితులను కూడా ఆయన వివరించారు. ఇదేసమయంలో పేరు చెప్పకుండా.. కొందరు నాయకులపైనా విమర్శలు చేశారు.
అదేవిదంగా పోలీసులపైనా వర్మ విరుచుకుపడ్డారు. పోలీసులకు తగిన మొత్తంలో రావాల్సినవి, కావాల్సినవి అందుతున్నాయని.. అందుకే ఇంత అక్రమాలు జరుగుతున్నా.. ఎవరూ నోరు విప్పడం లేదని.. కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక్క చెరువు నిర్మాణానికి మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ అనుమతి ఇచ్చారని.. కానీ, కొందరు ఇక్కడ చెలరేగిపోతున్నారని.. చెప్పుకొచ్చారు. ఇదేసమయంలో పోలీసులకు రేచీకటి వచ్చిందని.. వారు ఇబ్బంది పడుతున్నారని సెటైర్లు వేశారు. వారికి సరైన కళ్లద్దాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
ఈ పరిణామం అటు టీడీపీలోను, ఇటు జనసేనలోనూ రాజకీయ కాక పెంచింది. వర్మ ఎవరినీ నేరుగా టార్గెట్ చేయకపోయినప్పటికీ.. స్థానికంగా ఉన్న జనసేన నాయకులు మాత్రం ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. కూటమి మిత్ర ధర్మాన్ని కూడా వర్మ పట్టించుకోవడం లేదని.. ఆయనను ఉపేక్షిస్తే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వర్మ వర్గం.. ఆయనను వెనుకేసుకు వచ్చింది. కూటమి ప్రభుత్వం తప్పులు చేయకూడదన్న ఉద్దేశంతోనే వర్మ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు వచ్చారని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారాలను అటు టీడీపీ, ఇటు జనసేన కీలక నాయకలు పరిశీలిస్తున్నారు.
అయితే.. ఇప్పటికిప్పుడు ఎవరిపైనా చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. పరిస్థితిని పార్టీ పెద్దలు పర్యవేక్షిస్తున్నారని.. సమయం చూసుకుని తగిన విధంగా స్పందిస్తారని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు. కానీ.. వర్మ వర్గం మాత్రం ఆయన పర్యవేక్షించడం వల్లే అక్రమాలు బయటకు వచ్చాయని.. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని.. లేకపోతే.. ఆయనతోపాటు టీడీపీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం వర్మ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది.
This post was last modified on June 8, 2025 4:09 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…