Political News

పిఠాపురంలో పొలిటిక‌ల్ హీట్‌?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. గ‌త నాలుగు రోజులుగా ఇక్క‌డ ఇసుక త‌వ్వ‌కాలు అన‌ధికారికంగా జ‌రుగుతున్నాయ‌ని.. ప‌ట్టించుకునే నాధుడు కూడా లేడ‌ని.. సాక్షాత్తూ.. టీడీపీ నాయ‌కుడు, ప‌వ‌న్ కోసం టికెట్ త్యాగం చేసిన వ‌ర్మ ఆరోపించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతానికి మీడియాను కూడా తీసుకువెళ్లారు. స్తానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో పేరు చెప్ప‌కుండా.. కొంద‌రు నాయ‌కుల‌పైనా విమ‌ర్శ‌లు చేశారు.

అదేవిదంగా పోలీసుల‌పైనా వ‌ర్మ విరుచుకుప‌డ్డారు. పోలీసుల‌కు త‌గిన మొత్తంలో రావాల్సిన‌వి, కావాల్సిన‌వి అందుతున్నాయని.. అందుకే ఇంత అక్ర‌మాలు జ‌రుగుతున్నా.. ఎవ‌రూ నోరు విప్ప‌డం లేద‌ని.. క‌నీసం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న కూడా చేయ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక్క‌డ ఒక్క చెరువు నిర్మాణానికి మాత్ర‌మే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అనుమ‌తి ఇచ్చార‌ని.. కానీ, కొంద‌రు ఇక్క‌డ చెల‌రేగిపోతున్నార‌ని.. చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో పోలీసుల‌కు రేచీక‌టి వ‌చ్చింద‌ని.. వారు ఇబ్బంది ప‌డుతున్నార‌ని సెటైర్లు వేశారు. వారికి స‌రైన క‌ళ్ల‌ద్దాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌న్నారు.

ఈ ప‌రిణామం అటు టీడీపీలోను, ఇటు జ‌న‌సేన‌లోనూ రాజకీయ కాక పెంచింది. వ‌ర్మ ఎవ‌రినీ నేరుగా టార్గెట్ చేయ‌క‌పోయిన‌ప్పటికీ.. స్థానికంగా ఉన్న జ‌న‌సేన నాయ‌కులు మాత్రం ఆయ‌నపై నిప్పులు చెరుగుతున్నారు. కూట‌మి మిత్ర ధ‌ర్మాన్ని కూడా వ‌ర్మ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న‌ను ఉపేక్షిస్తే.. ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు వ‌ర్మ వ‌ర్గం.. ఆయ‌న‌ను వెనుకేసుకు వచ్చింది. కూట‌మి ప్ర‌భుత్వం త‌ప్పులు చేయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే వ‌ర్మ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చార‌ని అంటున్నారు. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారాల‌ను అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన కీల‌క నాయ‌క‌లు ప‌రిశీలిస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎవ‌రిపైనా చ‌ర్య‌లు తీసుకునే ఉద్దేశం లేద‌ని సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు. ప‌రిస్థితిని పార్టీ పెద్ద‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని.. స‌మ‌యం చూసుకుని త‌గిన విధంగా స్పందిస్తార‌ని ఇరు పార్టీల నాయ‌కులు అంటున్నారు. కానీ.. వ‌ర్మ వ‌ర్గం మాత్రం ఆయ‌న ప‌ర్య‌వేక్షించ‌డం వ‌ల్లే అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని.. ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. లేక‌పోతే.. ఆయ‌న‌తోపాటు టీడీపీకి కూడా బ్యాడ్ నేమ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్మ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయింది.

This post was last modified on June 8, 2025 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

10 minutes ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

12 minutes ago

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి…

36 minutes ago

రాజు గారెక్కడ రాజాసాబ్?

ప్రభాస్‌ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…

2 hours ago

రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…

4 hours ago

కోర్టు కటాక్షం… జన నాయకుడికి మోక్షం

ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…

4 hours ago