అమరావతిలో మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి చానెల్లో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆదివారం ఉదయం పార్టీ నాయకులతోనే కాకుండా.. మంత్రులతోనూ ఆయన చర్చించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పిన ఆయన.. దీనిపై ఎవరూ స్పందించరాదని ఆదేశించినట్టు తెలిసింది. ప్రభుత్వం పరంగా.. చర్యలు తీసుకుంటామని.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ పరంగా తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మంత్రులతోనూ ప్రత్యేకంగా చర్చించారు.
ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. దీనిని సీరియస్ గా తీసుకుని తీరాలని చాలా మంది మంత్రులు తేల్చిచెప్పారు. అంతేకాదు.. అమరావతి మహిళలను కించ పరచడం వైసీపీకి కొత్తకాదని.. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా.. వ్యాఖ్యానించారు. గతంలోనూ మహిళలపై దాడులు చేయించిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు మరింత పేట్రేగి పోయారని.. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇక, అమరావతి ఘటనపై చర్యల విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని కొందరు సూచించారు. ఇది ఖండించాల్సిన విషయమేనని.. అయితే.. ఏం చేసినా.. మళ్లీ మహిళలకు ఇబ్బందులు రాకుండా చూడాలని వారు కోరారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. అక్కడ వేరే రకానికి చెందిన వారు ఉంటున్నారని చెప్పడం ద్వారాపెట్టుబడులపై దెబ్బ కొట్టాలన్న వ్యూహం దాగి ఉండి ఉంటుందని మహిళా మంత్రి ఒకరు చెప్పారు. దీనిని చంద్రబాబు కూడా అంగీకరించారు.
ఇప్పటికే అనేక రూపాల్లో వైసీపీ నాయకులు పేట్టుబడులను అడ్డుకుంటున్నారని.. అయినప్పటికీ ప్రభుత్వం నానా ప్రయాసలు పడి పెట్టుబడులు తెస్తోందని.. అయినప్పటికీ.. వైసీపీ జీర్ణించుకోలేక పోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదేసమయంలో మహిళల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయించే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు.
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…