Political News

అమ‌రావ‌తి ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే!

అమ‌రావ‌తిలో మ‌హిళ‌ల‌పై వైసీపీకి చెందిన సాక్షి చానెల్‌లో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆదివారం ఉద‌యం పార్టీ నాయ‌కుల‌తోనే కాకుండా.. మంత్రుల‌తోనూ ఆయ‌న చ‌ర్చించారు. ఈ వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు చెప్పిన ఆయ‌న‌.. దీనిపై ఎవ‌రూ స్పందించ‌రాద‌ని ఆదేశించిన‌ట్టు తెలిసింది. ప్ర‌భుత్వం ప‌రంగా.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. దీనిపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని పార్టీ ప‌రంగా తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో మంత్రుల‌తోనూ ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏం చేయాల‌న్న విష‌యంపై ఆయ‌న ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుని తీరాల‌ని చాలా మంది మంత్రులు తేల్చిచెప్పారు. అంతేకాదు.. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను కించ ప‌ర‌చ‌డం వైసీపీకి కొత్త‌కాద‌ని.. దీనికి ఎక్క‌డో ఒక‌చోట ఫుల్ స్టాప్ పెట్టాల‌ని కూడా.. వ్యాఖ్యానించారు. గ‌తంలోనూ మ‌హిళ‌ల‌పై దాడులు చేయించిన చ‌రిత్ర ఉంద‌న్నారు. ఇప్పుడు మ‌రింత పేట్రేగి పోయార‌ని.. రాజ‌ధాని ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఇక‌, అమ‌రావతి ఘ‌ట‌న‌పై చ‌ర్య‌ల విష‌యంలో ఆచి తూచి అడుగులు వేయాల‌ని కొంద‌రు సూచించారు. ఇది ఖండించాల్సిన విష‌య‌మేన‌ని.. అయితే.. ఏం చేసినా.. మ‌ళ్లీ మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు రాకుండా చూడాల‌ని వారు కోరారు. రాజ‌ధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. అక్క‌డ వేరే ర‌కానికి చెందిన వారు ఉంటున్నార‌ని చెప్ప‌డం ద్వారాపెట్టుబ‌డుల‌పై దెబ్బ కొట్టాల‌న్న వ్యూహం దాగి ఉండి ఉంటుంద‌ని మ‌హిళా మంత్రి ఒక‌రు చెప్పారు. దీనిని చంద్ర‌బాబు కూడా అంగీక‌రించారు.

ఇప్ప‌టికే అనేక రూపాల్లో వైసీపీ నాయ‌కులు పేట్టుబడుల‌ను అడ్డుకుంటున్నార‌ని.. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నానా ప్ర‌యాస‌లు ప‌డి పెట్టుబ‌డులు తెస్తోంద‌ని.. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ జీర్ణించుకోలేక పోతోంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం త‌ర‌ఫున చ‌ర్య‌లు తీసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో మ‌హిళ‌ల త‌ర‌ఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాలు చేయించే దిశ‌గా కూడా ఆలోచ‌న చేస్తున్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

44 minutes ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

1 hour ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

4 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

4 hours ago