హైదరాబాద్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల ఐమ్యాక్స్ థియేటర్. సిటీలో బోలెడు మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు ఉన్నప్పటికీ అసలైన కిక్ ఇచ్చే తెర లేకపోవడం ఎప్పటి నుంచో వెలితిగా ఫీలవుతున్నారు. జనాభా, విస్తీర్ణంలో భాగ్యనగరం కన్నా చిన్నవైన కోచి, పూణే లాంటి ప్రాంతాల్లో ఉన్న ఐమాక్స్ తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం గురించి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ త్వరలో హకీం పేటలో ఐమాక్స్ ని తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందనే శుభవార్త చెప్పడం సినీ ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఎప్పటి నుంచనేది నిర్ధారణగా చెప్పలేదు కానీ 2027లో ప్రారంభమవ్వొచ్చని హింట్ ఇచ్చారు. అంటే మహేష్ బాబు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీతో దాని ఓపెనింగ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్, సూళ్లూరుపేట వి సెల్యులాయిడ్స్ లో అతి పెద్ద స్క్రీన్లు ఉన్నప్పటికీ వాటిలో ఐమాక్స్ టెక్నాలజీ లేదు. తెర ఎంత భారీగా ఉన్నా పోలిక పరంగా చూసుకుంటే అనుభూతి తక్కువే. కాకపోతే ఉన్నవాటిలో బెస్ట్ విజువల్, సౌండ్ ఎక్స్ పీరియన్స్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు ఐమాక్స్ వస్తే మాత్రం ప్రేక్షకులు అందులో సినిమా చూసేందుకు ఎగబడటం ఖాయం.
నిజానికి ఇంత ఆలస్యం కావడం వెనుక కారణాలు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలకు సంబంధించి గరిష్ట పరిమితి ఒకటుంది. దాన్ని దాటి రేట్ ఎక్కువ కావాలంటే ప్రభుత్వానికి విన్నపం చేసుకోవాలి. అది కూడా పరిమిత కాలానికి మాత్రమే ఇస్తారు. కానీ బెంగళూరు, ముంబై, కోచి లాంటి చోట ఈ సమస్య లేదు. గరిష్టంగా 2 వేల రూపాయలకు పైనే వసూలు చేసే అనుమతులు ఉంటాయి. ప్రతిసారి పర్మిషన్లు అక్కర్లేదు. కానీ ఏపీ తెలంగాణలో అలా సాధ్యం కాదు. ఇప్పుడు ఐమాక్స్ కనక సానుకూల ధరతో టికెట్లు పెడితే కనక హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు బాగా ఆస్వాదించవచ్చు.
This post was last modified on June 8, 2025 3:23 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…