గుండెపోటు కారణంగా మూడు రోజుల పాటు జీవన పోరాటం చేసిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాగంటికి నివాళి అర్పించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా మాగంటి పార్థీవ దేహాన్ని చూసినంతనే కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. భావోద్వేగంతో కేసీఆర్ కన్నీరు పెట్టుకుని ఏడ్చేశారు.
ఆ తర్వాత కాస్తంత తమాయించుకున్న కేసీఆర్.. మాగంటి కుమారుడిని దగ్గరకు పిలుచుకుని మరీ భుజంపై చేయి వేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. మాగంటి మృతదేహం వద్ద కేసీఆర్ కన్నీరు పెట్టుకుని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కు ఉన్న అతికొద్ది మంది నమ్మకస్తుల్లో మాగంటి గోపీనాథ్ ఒకరు. కేసీఆర్ తరఫున కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలు తీసుకునే వారి జాబితాలో మాగంటి ఎప్పుడో చోటు దక్కించుకున్నారు.
టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మాగంటి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే… రాష్ట్ర విభజన పరిణామాలతో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. టీడీపీలో ఏ స్థాయి ప్రాధాన్యతతో పనిచేశారో…బీఆర్ఎస్ లోనూ మాగంటి అంతే ప్రాధాన్యత కలిగిన బాధ్యతల్లో కొనసాగారు. బీఆర్ఎస్ లో చేరిన అనతి కాలంలోనే కేసీఆర్ గుడ్ లుక్స్ లో పడిపోయిన మాగంటి పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. అలాంటి నేత మరణాన్ని చూసి కేసీఆర్ తట్టుకోలేకపోయారు. ఈ కారణంగా మాగంటి భౌతిక కాయాన్ని చూడగానే కేసీఆర్ కన్నీటిని ఆపుకోలేకపోయారు.
This post was last modified on June 8, 2025 3:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…