Political News

కాళేశ్వ‌రంలో ఏం జ‌రిగిందో వారికి మాత్ర‌మే తెలుసు: ఈట‌ల‌

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌కు తాజాగా బీజేపీ నాయ‌కుడు, అప్ప‌టి బీఆర్ ఎస్ మంత్రి ఈటల రాజేంద‌ర్ హాజర‌య్యారు. సుమారు రెండు గంట‌ల‌కుపైగా విచార‌ణ క‌మిష‌న్ ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. అయితే.. లోప‌ల ఏం జ‌రిగింద‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈటల మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రిగిందో `ఆ ఇద్ద‌రికి` మాత్ర‌మే తెలుసున‌ని వ్యాఖ్యానించారు. త‌న త‌ల‌పై తుపాకీ గురిపెట్టినా.. తాను చెప్పేది ఇదేన‌ని తేల్చి చెప్పారు. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నే దానిపై స్పందిస్తూ.. ఒక‌రు కేసీఆర్‌, మ‌రొక‌రు హ‌రీష్ రావులేన‌ని పేర్కొన్నారు. కాళేశ్వరం విష‌యంలో త‌న పాత్ర ఏమీ లేద‌న్నారు. ప్రాజెక్టును తొలుత చేసిన డిజైన్ ను కాద‌ని.. రీడిజైన్ చేశార‌ని.. దీనికి గాను అప్ప‌టి సీఎంగా కేసీఆర్ ఓ క‌మిటీని ఏర్పాటు చేశార‌ని తెలిపారు.

దీనికి అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హ‌రీష్‌రావు చైర్మ‌న్‌గా ఉన్న‌ట్టు ఈట‌ల చెప్పారు. ఇంత‌కుమించి త‌న‌కు తెలియ‌ద‌ని వెల్ల‌డించారు. అయితే.. మేడిగ‌డ్డ అంశం మాత్రం మ‌ధ్య‌లో వ‌చ్చింద‌న్నారు. కాళేశ్వ‌రానికి ఊహించ‌ని విధంగా నీరు వ‌చ్చి చేరుతుంద‌ని అంచ‌నా వేశార‌ని.. దీంతో మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ క‌ట్టార‌ని ఈట‌ల వివ‌రించారు. “ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా నాకు ఇంత‌కుమించి ఏమీ తెలియ‌దు. పైగా ఇది ఇంజ‌నీర్ల‌కు సంబంధించిన విష‌యం. ఆ ఇద్ద‌రే దీనిని చూశారు“ అని ఈట‌ల వివ‌రించారు.

అదేవిధంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌యంపైనా ఈట‌ల వివ‌ర‌ణ ఇచ్చారు. వాస్త‌వానికి తొలినాళ్ల‌లో ప్రాజెక్టు కోసం 62-63 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌ని అనుకున్నా.. త‌ర్వాత ప్రాజెక్టు ఖ‌ర్చు పెరిగింద‌ని.. దీంతో మ‌రో 20 వేల కోట్ల‌ను అద‌నంగా వెచ్చించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్ప‌టికీ .. త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌న్నారు. త‌న‌కు తెలిసిన‌వి ఇవేన‌ని.. ఇంత‌కు మించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న త‌ల‌పై తుపాకీ గురి పెట్టినా.. ఇదే చెబుతాన‌న్నారు.

This post was last modified on June 6, 2025 8:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago