Political News

కాళేశ్వ‌రంలో ఏం జ‌రిగిందో వారికి మాత్ర‌మే తెలుసు: ఈట‌ల‌

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌కు తాజాగా బీజేపీ నాయ‌కుడు, అప్ప‌టి బీఆర్ ఎస్ మంత్రి ఈటల రాజేంద‌ర్ హాజర‌య్యారు. సుమారు రెండు గంట‌ల‌కుపైగా విచార‌ణ క‌మిష‌న్ ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. అయితే.. లోప‌ల ఏం జ‌రిగింద‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈటల మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రిగిందో `ఆ ఇద్ద‌రికి` మాత్ర‌మే తెలుసున‌ని వ్యాఖ్యానించారు. త‌న త‌ల‌పై తుపాకీ గురిపెట్టినా.. తాను చెప్పేది ఇదేన‌ని తేల్చి చెప్పారు. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నే దానిపై స్పందిస్తూ.. ఒక‌రు కేసీఆర్‌, మ‌రొక‌రు హ‌రీష్ రావులేన‌ని పేర్కొన్నారు. కాళేశ్వరం విష‌యంలో త‌న పాత్ర ఏమీ లేద‌న్నారు. ప్రాజెక్టును తొలుత చేసిన డిజైన్ ను కాద‌ని.. రీడిజైన్ చేశార‌ని.. దీనికి గాను అప్ప‌టి సీఎంగా కేసీఆర్ ఓ క‌మిటీని ఏర్పాటు చేశార‌ని తెలిపారు.

దీనికి అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హ‌రీష్‌రావు చైర్మ‌న్‌గా ఉన్న‌ట్టు ఈట‌ల చెప్పారు. ఇంత‌కుమించి త‌న‌కు తెలియ‌ద‌ని వెల్ల‌డించారు. అయితే.. మేడిగ‌డ్డ అంశం మాత్రం మ‌ధ్య‌లో వ‌చ్చింద‌న్నారు. కాళేశ్వ‌రానికి ఊహించ‌ని విధంగా నీరు వ‌చ్చి చేరుతుంద‌ని అంచ‌నా వేశార‌ని.. దీంతో మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ క‌ట్టార‌ని ఈట‌ల వివ‌రించారు. “ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా నాకు ఇంత‌కుమించి ఏమీ తెలియ‌దు. పైగా ఇది ఇంజ‌నీర్ల‌కు సంబంధించిన విష‌యం. ఆ ఇద్ద‌రే దీనిని చూశారు“ అని ఈట‌ల వివ‌రించారు.

అదేవిధంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌యంపైనా ఈట‌ల వివ‌ర‌ణ ఇచ్చారు. వాస్త‌వానికి తొలినాళ్ల‌లో ప్రాజెక్టు కోసం 62-63 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌ని అనుకున్నా.. త‌ర్వాత ప్రాజెక్టు ఖ‌ర్చు పెరిగింద‌ని.. దీంతో మ‌రో 20 వేల కోట్ల‌ను అద‌నంగా వెచ్చించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్ప‌టికీ .. త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌న్నారు. త‌న‌కు తెలిసిన‌వి ఇవేన‌ని.. ఇంత‌కు మించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న త‌ల‌పై తుపాకీ గురి పెట్టినా.. ఇదే చెబుతాన‌న్నారు.

This post was last modified on June 6, 2025 8:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బెంగళూరులో టెకీ జంట సూసైడ్… ఇద్దరు తెలుగువారే

షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…

3 minutes ago

కల్కి 2… సుప్రీమ్ బలాన్ని పెంచుతున్న నాగ్ అశ్విన్?

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొదటి…

3 minutes ago

వైభవ్ సూర్యవంశీ… ఎందుకంత తొందర?

​రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర…

26 minutes ago

రాకాస మీద ప్రాణాలు పెట్టుకున్నారు

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రాకాస మీద టీమ్ మొత్తం ప్రాణాలు పెట్టేసుకుంది. నిర్మాత నీహారిక కొణిదెల చాలా యాక్టివ్…

38 minutes ago

ధూరందర్, యానిమల్… నీ దారెటు భాయ్?

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, రీసెంట్…

1 hour ago

బైకర్… గట్టిగా కొట్టాలి సిక్సర్

మార్చి నెలలో దురంధర్ ది రివెంజ్ కనక ఆదుకోకపోయి ఉంటే తెలుగు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి మరింత అన్యాయంగా ఉండేది.…

2 hours ago