Political News

కాళేశ్వ‌రంలో ఏం జ‌రిగిందో వారికి మాత్ర‌మే తెలుసు: ఈట‌ల‌

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌కు తాజాగా బీజేపీ నాయ‌కుడు, అప్ప‌టి బీఆర్ ఎస్ మంత్రి ఈటల రాజేంద‌ర్ హాజర‌య్యారు. సుమారు రెండు గంట‌ల‌కుపైగా విచార‌ణ క‌మిష‌న్ ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. అయితే.. లోప‌ల ఏం జ‌రిగింద‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈటల మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రిగిందో `ఆ ఇద్ద‌రికి` మాత్ర‌మే తెలుసున‌ని వ్యాఖ్యానించారు. త‌న త‌ల‌పై తుపాకీ గురిపెట్టినా.. తాను చెప్పేది ఇదేన‌ని తేల్చి చెప్పారు. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నే దానిపై స్పందిస్తూ.. ఒక‌రు కేసీఆర్‌, మ‌రొక‌రు హ‌రీష్ రావులేన‌ని పేర్కొన్నారు. కాళేశ్వరం విష‌యంలో త‌న పాత్ర ఏమీ లేద‌న్నారు. ప్రాజెక్టును తొలుత చేసిన డిజైన్ ను కాద‌ని.. రీడిజైన్ చేశార‌ని.. దీనికి గాను అప్ప‌టి సీఎంగా కేసీఆర్ ఓ క‌మిటీని ఏర్పాటు చేశార‌ని తెలిపారు.

దీనికి అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హ‌రీష్‌రావు చైర్మ‌న్‌గా ఉన్న‌ట్టు ఈట‌ల చెప్పారు. ఇంత‌కుమించి త‌న‌కు తెలియ‌ద‌ని వెల్ల‌డించారు. అయితే.. మేడిగ‌డ్డ అంశం మాత్రం మ‌ధ్య‌లో వ‌చ్చింద‌న్నారు. కాళేశ్వ‌రానికి ఊహించ‌ని విధంగా నీరు వ‌చ్చి చేరుతుంద‌ని అంచ‌నా వేశార‌ని.. దీంతో మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ క‌ట్టార‌ని ఈట‌ల వివ‌రించారు. “ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా నాకు ఇంత‌కుమించి ఏమీ తెలియ‌దు. పైగా ఇది ఇంజ‌నీర్ల‌కు సంబంధించిన విష‌యం. ఆ ఇద్ద‌రే దీనిని చూశారు“ అని ఈట‌ల వివ‌రించారు.

అదేవిధంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌యంపైనా ఈట‌ల వివ‌ర‌ణ ఇచ్చారు. వాస్త‌వానికి తొలినాళ్ల‌లో ప్రాజెక్టు కోసం 62-63 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌ని అనుకున్నా.. త‌ర్వాత ప్రాజెక్టు ఖ‌ర్చు పెరిగింద‌ని.. దీంతో మ‌రో 20 వేల కోట్ల‌ను అద‌నంగా వెచ్చించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్ప‌టికీ .. త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌న్నారు. త‌న‌కు తెలిసిన‌వి ఇవేన‌ని.. ఇంత‌కు మించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న త‌ల‌పై తుపాకీ గురి పెట్టినా.. ఇదే చెబుతాన‌న్నారు.

This post was last modified on June 6, 2025 8:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

50 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago