Political News

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. లోకేష్ కీల‌క ఒప్పందం!

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏప్ర‌భుత్వం చేయ‌ని విధంగా తొలిసారిగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేస‌మ‌యంలో కీల‌క ఒప్పందం కూడా చేసుకుంది. అదే ఏఐ ఒప్పందం. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా”తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఒప్పందం ద్వారా.. 10 వేల మంది యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌నున్నారు.

ముఖ్యంగా 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఈ కేంద్రాన్ని రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్నారు.  `ఎన్ విడియా`తో తాజాగా ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నా రు. దేశంలో ఏఐ ఆధారిత పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా నిల‌పాలని మంత్రి నారా లోకేష్ అభిల‌షిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిని `ఎన్ విడియా` స‌హ‌కారం అందించ‌నుంది.

ఈ ప్రాజెక్టులో ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు.10 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి కృషి చేయ‌నున్నారు. అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ లు, హార్డ్‌వేర్ సామర్థ్యాలను అందించ‌నున్నారు. విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్‌షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు.

This post was last modified on June 6, 2025 8:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

22 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

44 minutes ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

52 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

9 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

9 hours ago