Political News

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. లోకేష్ కీల‌క ఒప్పందం!

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏప్ర‌భుత్వం చేయ‌ని విధంగా తొలిసారిగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేస‌మ‌యంలో కీల‌క ఒప్పందం కూడా చేసుకుంది. అదే ఏఐ ఒప్పందం. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా”తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఒప్పందం ద్వారా.. 10 వేల మంది యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌నున్నారు.

ముఖ్యంగా 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఈ కేంద్రాన్ని రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్నారు.  `ఎన్ విడియా`తో తాజాగా ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నా రు. దేశంలో ఏఐ ఆధారిత పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా నిల‌పాలని మంత్రి నారా లోకేష్ అభిల‌షిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిని `ఎన్ విడియా` స‌హ‌కారం అందించ‌నుంది.

ఈ ప్రాజెక్టులో ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు.10 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి కృషి చేయ‌నున్నారు. అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ లు, హార్డ్‌వేర్ సామర్థ్యాలను అందించ‌నున్నారు. విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్‌షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు.

This post was last modified on June 6, 2025 8:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

5 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

5 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

5 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

7 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

8 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

8 hours ago