Political News

దేశంలో కొత్త యుగం.. అమ‌రావతి కూడా..: చంద్ర‌బాబు

దేశంలో కొత్త యుగం ప్రారంభ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ఆయ‌న మ‌రోసారి ఆకాశానికి ఎత్తేశారు. “చేయాల‌న్న ద్రుఢ సంక‌ల్పం.. ప‌ట్టుద‌ల ఉంటే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండ‌బోద‌“ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. దీనిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనే నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. తాజాగా జ‌మ్ముక‌శ్మీర్‌లో నిర్మించిన రెండు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాని ప్రారంభించారు. వీటిని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు.. ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపించారు.

జ‌మ్ము క‌శ్మీర్‌లో దాయాది దేశం పాకిస్తాన్ నుంచి మ‌న‌కు అనేక స‌వాళ్లు ఎదుర‌వుతూ ఉంటాయి. దీంతో అక్క‌డ ప‌క్కా భ‌ద్ర‌త‌, అనుక్ష‌ణం అప్ర‌మ‌త్త‌తతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంది. ఇలాంటి చోట‌.. రెండు కీల‌క‌మైన ప్రాజెక్టుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శ్రీకారం చుట్ట‌డ‌మే కాకుండా.. వాటిని తాజాగా ప్రారంభించింది. వీటిలో 1) చీనాబ్ బ్రిడ్జి. 2) అంజీ రైల్వే వంతెన‌. ఈ రెండు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు.

చీనాబ్ బ్రిడ్జి: ఇది  ప్రపంచంలోనే ఎత్తయిన రైలు ఆర్చ్‌ వంతెన.
అంజీ రైల్వే వంతెన‌: ఇది  దేశంలోనే మొట్టమొదటి తీగలతో అనుసంధానించిన నిర్మాణం.

వందేభారత్‌ రైళ్లను వీటి ద్వారా న‌డుపుతారు. ముఖ్యంగా వైష్ణోదేవి కొలువైన కట్‌ఢా నుంచి శ్రీనగర్‌ వరకు రైళ్లు అందుబాటులోకి వ‌స్తాయి. ఇంత సాహ‌సోపేత మైన నిర్మాణాలు చేయ‌డం.. ప్రారంభించ‌డం.. ప్ర‌ధాని మోడీకే సాధ్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇదే త‌ర‌హాలోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వరం వంటి కీల‌క ప్రాజెక్టుల‌ను కూడా పూర్తి చేస్తామ‌ని.. కేంద్ర స‌హ‌కారంతో రాష్ట్రంలోనూ సువ‌ర్ణ యుగం ప్రారంభం అవుతుంద‌ని చంద్ర‌బాబు అభిల‌షించారు. అమ‌రావ‌తి కూడా దేశానికే త‌ల‌మానికమైన ప్రాజెక్టుగా నిలుస్తుంద‌న్నారు.

This post was last modified on June 6, 2025 7:17 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

8 minutes ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

2 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

4 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

7 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

10 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

10 hours ago