దేశంలో కొత్త యుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. “చేయాలన్న ద్రుఢ సంకల్పం.. పట్టుదల ఉంటే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండబోద“ని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే నిదర్శనమని తెలిపారు. తాజాగా జమ్ముకశ్మీర్లో నిర్మించిన రెండు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. వీటిని ప్రస్తావించిన చంద్రబాబు.. ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.
జమ్ము కశ్మీర్లో దాయాది దేశం పాకిస్తాన్ నుంచి మనకు అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. దీంతో అక్కడ పక్కా భద్రత, అనుక్షణం అప్రమత్తతతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇలాంటి చోట.. రెండు కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడమే కాకుండా.. వాటిని తాజాగా ప్రారంభించింది. వీటిలో 1) చీనాబ్ బ్రిడ్జి. 2) అంజీ రైల్వే వంతెన. ఈ రెండు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
చీనాబ్ బ్రిడ్జి: ఇది ప్రపంచంలోనే ఎత్తయిన రైలు ఆర్చ్ వంతెన.
అంజీ రైల్వే వంతెన: ఇది దేశంలోనే మొట్టమొదటి తీగలతో అనుసంధానించిన నిర్మాణం.
వందేభారత్ రైళ్లను వీటి ద్వారా నడుపుతారు. ముఖ్యంగా వైష్ణోదేవి కొలువైన కట్ఢా నుంచి శ్రీనగర్ వరకు రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఇంత సాహసోపేత మైన నిర్మాణాలు చేయడం.. ప్రారంభించడం.. ప్రధాని మోడీకే సాధ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే తరహాలోనే ఏపీ రాజధాని అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని.. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోనూ సువర్ణ యుగం ప్రారంభం అవుతుందని చంద్రబాబు అభిలషించారు. అమరావతి కూడా దేశానికే తలమానికమైన ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.
This post was last modified on June 6, 2025 7:17 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…