బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయనపై సీఐడీ కేసు ఉంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఆరోపణలు చేసే ముందు.. ఆలోచన ఉండాలని.. అదేవిధంగా ఆధారాలు కూడా ఉండాలని పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఫ్యాషన్గా మారిందా? అని ప్రశ్నించడం గమనార్హం. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగింది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం అవినీతికి పాల్పడుతోందని.. ఒక్క ప్రాజెక్టులోనే 25 వేల కోట్ల మేరకు సొమ్ములు నొక్కేశారని కేటీఆర్ ఆరోపించారు. అయితే.. ఈవ్యవహారం కాస్తా దుమారం రేపింది. దీనిపై కోర్టుకు వెళ్తామని.. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు అప్పట్లో నే సవాల్ రువ్వారు. కేటీఆర్పై విమర్శలు కూడా చేశారు. అయితే.. కేటీఆర్ మౌనం వహించారు. దీంతో గడువు తీరిన తర్వాత కూడా.. కేటీఆర్ మౌనంగా ఉండడంతో ఆత్రం సుగుణ పోలీసులను ఆశ్రయించారు.
కేటీఆర్ తమ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కేసు పెట్టారు. దీంతో సదరు కేసును కొట్టి వేయాలని కోరుతూ.. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో ఉట్నూరు పోలీసులు నమోదు చేసిన కేసును, ఎఫ్ ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే.. ఆత్రం సుగుణ మాత్రం.. దీనిని వదిలి పెట్టకుండా .. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తాజా ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అవినీతి, అక్రమాల ఆరోపణలు చేసే ముందు .. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బాగుండేదన్న న్యాయస్థానం.. దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ను ఆదేశిస్తూ..నోటీసులు జారీ చేయడం గమనార్హం.
This post was last modified on June 6, 2025 8:08 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…